హిందూ సంప్రదాయం ప్రకారం నిత్యం దేవతారాధన చేస్తాం. దీనిలో ప్రధానంగా వినిపించేది షోడశోపచార పూజలు అయితే ఇది అందరికీ అన్ని వేళలా వీలుకావు. దీనికి ప్రత్యామ్నాయంగా చేసేదే పంచోపచార పూజలు అవి ఏమిటో తెలుసుకుందాం…
షోడశ ఉపచారాల్లో ఉన్నవాటినే ఐదింటిని గ్రహించి పంచోపచారపూజ ఎలా చేయాలో మూడు విధాలుగా చెప్పడం జరిగింది.
మొదటి పద్ధతి
గంధం: మొదట దేవునికి గంధం ధరింపచేయడం (సమర్పించడం)
పుష్పం: తర్వాత దేవునికి పుష్పసమర్పణం
దీపం: ఆ తర్వాత దేవునికి దీపారాధన చెయ్యడం
ధూపం: ఆ తర్వాత ధూపాన్ని సమర్పించడం
నైవేద్యం: చివరిగా నైవేద్యం సమర్పించడం.
చేయడం లఘు పద్ధతిగా ఉపయోగిస్తాం.
ఇక రెండవ పద్ధతి
ధ్యానం: ఆ దేవుణ్ణి మనసారా ధ్యానించడం
ఆవాహనం: ధ్యానించిన దేవుణ్ణి ఆవాహన చేయడం.
నైవేద్యం: ఆవాహన చేసిన దేవునికి నైవేద్యం సమర్పించడం.
నీరాజనం: నైవేద్యం తర్వాత నీరాజనం (మంగళహారతి) సమర్పించడం
నమస్కారం: నీరాజనం చేసి నమస్కారం ఆచరించడం. ఇలా ఏదో ఒక పద్ధతిలో భగవత్ ఆరాధన భక్తి, శ్రద్ధలతో ఆచరించాలి.