సనాతన సంప్రదాయంలో అనేక నియమాలు. వాటి వెనుక సైన్స్ కానీ మనకు ఆ స్థాయి అర్థంకాక వాటిని తేలికగా తీసుకుంటున్నాం.
దీనికి ఒక ఉదాహరణ కరోన. అంతకుముందు నమస్కారం అంటే అందరు షేక్హ్యాండ్స్ ఇచ్చేవారు. పూర్వ సంప్రదాయం రెండు చేతులు జోడించడం అంటే వెటకారంగా చూసేవారు. కానీ కరోనా దెబ్బతో అందరూ దూరంగా నమస్కారం అని చెప్తున్నారు. ఇలాంటిదే భోజనం చేసే పద్ధతి ఒకటి. ఏ దిక్కుకు కూర్చుని భోజనం చేస్తే ఏమి ఫలితమో తెలుసుకుందాం…
దీర్ఘాయువును కోరుకునేవారు తూర్పు ముఖంగానూ, కీర్తిప్రతిష్టలను ఆశించేవారు దక్షినాభిముఖంగానూ కూర్చుని భోజనం చేయాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. సిరిసంపదలను, అష్టైశ్వర్యాలను కోరుకునేవారు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. భోజనం చేసే సమయంలో ఇతర ఆలోచనలకు తావులేకుండా మొదట తీపిపదార్థాలను, మధ్యలో ఉప్పు, పులుపు, కారం, చివరన వగరు, చేదు ముందు ద్రవపదార్థాన్ని, మధ్యలో గట్టి పదార్థాలను, తరువాత ద్రవపదార్థాలను తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేదంలో పొందుపర చబడింది. తల్లిదండ్రులు ఉన్నవారు దక్షిణముఖంగా కూర్చోకూడదట, ఉత్తరాముఖంగా కూర్చుని భోజనం చేయకూడదు అని శాస్త్రవచనం. పెద్దలు చెప్పిన నియమాలు పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.