సనాతన ధర్మంలొ అణువనువుణా దైవనామస్మరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎప్పడు ధర్మమార్గంలో నడవాలనే ఆచారాలను సంప్రదాయాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రాతఃకాలంలో నిద్రలేవగానే ఏం మననం చేసుకోవాలి? తర్వాత స్నానం చేసేటప్పుడు ఏం చదవాలి అనేవి తెలుసుకుందాం…
ఉదయం నిద్ర లేచిన తరువాత…. మనస్సులో లేదా బయటకు మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి,శ్రీహరి అని చదవాలి. తర్వాత “కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజతస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్” కాలు పక్కమీద నుంచి కింద పెట్టేటప్పుడు.. ఉదయం భూప్రార్ధన..“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”మానసిక శుద్ది..“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”ఉదయం కరదర్శనం. “కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం” స్నాన సమయంలో.. “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు”గంగా, గంగా, గంగా అని మూడుసార్లు చదువాలి. ఇలా దైనందిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే సకల శుభాలు కలుగుతాయి. దోషాలుపోతాయి. మనసు పాజిటివ్ వైబ్రేషన్స్తో చురుకుగా వేగంగా పరుగెడుతుంది.