స్వామీజీలు, సన్యాసులు, యతులు పండితులు ఇలా అనేక మంది ప్రతీ ఏటా రెండుసార్లు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. అయితే మొదటి దీక్ష తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వివరాలు పరిశీలిస్తే… ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు.
అంటే ఆషాఢం, శ్రావణం, బాధ్రపదం, కార్తీకమాసం ఈ నాలుగునెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయణంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి..
ఇప్పుడు ఎందుకు ?
వేసవి కాలం పూర్తవుతుంది. వర్షాకాలం ప్రారంభం అవుతుంది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలలో వ్యవసాయ పనులు పుంజుకుంటాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడం ప్రారంభమవుతుంది. సామాజికంగా, వాతావరణ పరంగా ఈ కాలం చాలా కీలకం. దీంతోపాటు
వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటుచేశారు.