దీపావళి రోజు ఏ నూనెతో దీపారాధన చేయాలన్న సందేహం చాలామందిలో కలుగుతుంది. ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా శ్రేష్ఠం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది.
దీనివల్ల ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక రెండో పద్ధతి… వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది. నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం. మరో ముఖ్యవిషయం.. వేరుశెనగ నూనెను దీపారాధనకు వాడరాదు.