నవగ్రహ ఆరాధన అనేది ప్రతీ భక్తుడు ఏదో ఒక సందర్భంలో చేస్తుంటారు. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆయా గ్రహాల స్థితి బాగుండకపోవడం వాటి బాధల నుంచి తప్పించుకోవడానికి రకరకాల పూజలను నిర్వహించాలి. అయితే పండితులు పేర్కొన్న విధంగా చేస్తే సులభంగా, శ్రీఘ్రంగా మన దోషాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఆ పరిహారాలు తెలుసుకుందాం…
సూర్యగ్రహ అనుగ్రహముకు.. రథసప్తమి, సూర్య చంద్ర వ్రతము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం చేయాలి. ఇక అంగార గ్రహ అనుగ్రహానికి.. నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి. ఇక బుధుడు అనుగ్రహానికి..శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము చేయాలి. గురు అనుగ్రహానికి..
శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.
శుక్రుడు అనుగ్రహానికి.. వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం,
సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. అత్యంత ప్రభావవంతమైన శని అనుగ్రహానికి.. హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతము, కృష్ణ ఆరాధన, శివాభిషేకం, ఆంజనేయస్వామి ఆరాధన, విష్ణు ఆరాధన చేయాలి. అయ్యప్ప పూజ చేయాలి. రాహుగ్రహా అనుగ్రహమునకు..శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతాము. కేతువు అనుగ్రహానికి..వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే మంచి ఫలితములు వస్తాయి. నవగ్రహ దోషాలు పోవడానికి నిత్యం నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా, శ్రీదక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఎటువంటి దోషాలైనా తీవ్రత తగ్గి అనుకూల ఫలితాలు వస్తాయని పండితులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఎటువంటి పరిస్థితులలో ధర్మం, న్యాయం తప్పకుండా దోషాలు కాస్తా అనుకూల ఫలితాలు వస్తాయి.