Gomatha: గోవులను సేవించాలి:
ఆడవారు తెలిసి తెలియక ముట్లు,అంటు కలిపిన దోషం,
పెద్దలను కానీ , బ్రాహ్మణులను, భక్తులైన వారికి దూషించిన దోషం, పరులను హింసించిన దోషం,అలాగే పరులను హింసించిన పాపం పోగొట్టుకోవాలి అంటే కచ్చితం గా గోవులను సేవించాలి. దీనికి కారణం గోవు నందు సమస్త దేవతలు కొలువై ఉన్నారు. కాబట్టి గోవును పూజిస్తే అన్ని పాపాలు పరిహారం అవుతాయి. అంటే ఎలాంటి పాపం అయినా చేసేసి గోవును పూజిస్తే సరిపోతుంది అనుకోవడం అజ్ఞానం అని మరువకూడదు. మన నిత్యా జీవితం లో అనుకోకుండా పొరపాటున జరిగే వాటికి పరిహారం మాత్రమే ఇది.
Gomatha: గోమయంలో శ్రీ మహాలక్ష్మి నివాస స్థానం.
గోపాద ధూళి సమస్త పుణ్య నదులు, తీర్థములు కన్నా చాలా గొప్పది. గోపాద ధూళి సర్వ మంగళకరమయినది,శ్రేష్ఠమయినది గా చెప్పబడింది. గోమాహాత్మ్య వర్ణనను ఉదయం చదువుకోవడం వలన బ్రహ్మ హత్యా మహా పాతకములన్నియు పోతాయి .
ప్రతి అమావాస్యనాడు పఠించడం వలన మూడు నెలల మహాపాపములు తొలగిపోతాయి.
ప్రతి రోజు సంధ్యసమయం లో పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహము పొందగలుగుతారు.
గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా కొలుస్తారో.. వారి
మూడు తరాల పితృదేవతలు తరిస్తారు.
గోవుకు తృప్తిగా మేత, సెనగలు, బెల్లం తినిపించడం వలన సమస్త దేవతలు తృప్తి చెందుతారు.
గోవుకు మనసారా నమస్కరించిన కూడా మంచి ఫలితము పొందుతారు.
గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం.. భూ ప్రదక్షిణంతో సమానం.
ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొందడం తో పాటు విష్ణు సాన్నిధ్యమును కూడా పొందుతారు.కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అని పిలుస్తారు. కాబట్టి ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజుల పాటు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని తెలియచేయబడింది.