God : సర్వకామ సమృద్ధమైన:
దేవాలయం లో ధ్వజ సమర్పణ చేస్తే లోకంలో గొప్పకీర్తిని పొందటానికి కారణం అవుతుంది. భగవాన్ ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు అనడం లో సందేహం లేదు. అద్దం దానం చేసిన వారికి మంచిరూపం ప్రాప్తిస్తుంది. భగవంతుడికి పరిచర్యలు చేయడం కోసం చిన్న చిన్న పాత్రలను ఇచ్చినా కూడా సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసిన ఫలితం పొందుతారు. ధాన్యం , సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవారు అనంత పుణ్య ఫలాన్ని పొందుతారు. వెండి దానం మంచి రూపానికి, సర్వకోరికలు తీరడానికి బంగారం దానం చేయాలి.
God : ఉత్తరీయాన్ని సమర్పించుకుంటే:
అలాగే పాడి ఆవునుఇవ్వడం వలన గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిఇవ్వడం వలన పదింతలు పుణ్యఫలం దక్కుతుంది.
పచ్చని పతాకాలు కలిగిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి పొందుతారు. నీలపతాకాలు ఉన్న ధ్వజం ఇస్తే ఉత్తమలోకాలు పొందుతారు. ఆలయానికి మహాద్వార తోరణాలను సమర్పించినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరుచుకుని సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనం ఇవ్వడం వలన వైకుంఠంలో శాశ్వతం గా ఉండిపోయే ఫలం అందుకుంటారు. ఇక ఉత్తరీయాన్ని సమర్పించుకుంటే , అన్ని కోరికలు తీరుతాయి. దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటి కావలసిన వాటిని వాద్య పరికరాలను ఏర్పాటు చేసినవాడికి దేవసేనలో స్థానం ఏర్పడుతుంది అని విష్ణు ధర్మోత్తర పురాణం తెలియచేస్తుంది.
వంట పాత్రలను ఇచ్చినా కూడా:
దేవుడి సేవలో ఉండే వారికీ ఏ కొద్దిపాటి సహాయం చేసిన కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ఈ విధం గా ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యం మాత్రమే కాదు శోకరహితస్థితి ప్రాప్తిస్తుంది. వంట పాత్రలను ఇచ్చినా కూడా పుణ్యఫలమే. పుష్ప,వృక్ష, తోటలు దానం చేయడం గ్రామాధిపత్యానికి, జలాశయ ఏర్పాటు , వంటివి అన్ని భగవత్కృపను పొందటానికి మార్గాలే. గుడి అనేది ఒక పవిత్ర స్థానం. భక్తులు ఆ ప్రదేశం లో మనశ్శాంతిని,ప్రశాంతతని పొందుతారు. అలాంటి ఉత్తమ వ్యవస్థ అభివృద్ధికి ఎవరికి చేతనైనంత వారు సహకరించాలి అని ఇలా దేవాలయాలకు చేసే దాన విశేషాలను పురాణాలు తెలియ చేస్తున్నాయి.