sample 5 కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రులకు తాకిడి మించుతుంది. ఇప్పుడున్న పరిస్థితి వరకు పర్వలేదు. కానీ ఇది కరోనా. అసలు ఆగే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలి. మందులు ఉంచాలి. పరికరాలు పెంచాలి. వసతులు, పరుపులు, సిబ్బంది, పారిశుద్ధ్యం… ఒకటేమిటి అన్నీ చూసుకోవాలి. వీటికి ఆర్థికం కావాలి. ఓ వైపు రావాల్సిన ఆదాయం రాదు. మరోవైపు ఆరోగ్య వసతుల కల్పనకు అదనపు కార్చులూ ఉన్నాయి. అందుకే దాతృత్వానికి వేళయ్యింది.ఖజానాకు రూ. 15 వేల కోట్ల నష్టం…!రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం లేదు. మద్యం అమ్మకాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. రెవెన్యూ ఆదాయం లేదు. ఏ రకంగానూ ఖజానాకు జమలు రావట్లేదు. రాష్ట్ర ఆదాయ మార్గాల్లో ప్రధానమైన పన్నుల వసూలు, మద్యం, రిజిస్ట్రేషన్లు అన్నీ ఆగిపోయాయి. అందుకే ఈ 21 రోజుల్లో ప్రభుత్వం సుమారు రూ. 15 వేల కోట్లు కోల్పోనుంది. అందుకే ఇప్పుడు తక్షణ సాయం అందించాలి. అందుకే దాతృత్వానికి వేళయింది. పెద్దలు స్పందించాల్సిన సమయం వచ్చింది. కేవలం ఈ 21 రోజులతో ఆగితే 15 వేల కోట్లతో ఆగుతుంది. లేకుంటే ఖజానాకు నష్టం పెరుగుతుంది. అసలే ఆర్ధిక మాంద్యంలో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఇది కోలుకోలేని దెబ్బగా మిగులుతుంది.సినీ, కార్పొరేట్ దిగ్గజాలున్నాయిగా…!కరోనా నుండి తెరుకునేందుకు ఆర్థిక సాయం అందించడంలో ముందుగా సినీ హీరో నితిన్ ముందడుగు వేశారు. రెండు రాష్ట్రాలకు రూ. 10 లక్షలు చొప్పున ప్రకటించారు. వెంటనే అందించారు కూడా. తర్వాతే టీడీపీ అధినేత చంద్రబాబు రూ. 10 లక్షలతో పాటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల వేతనం ప్రకటించారు. అంటే దాదాపు రూ. 70 లక్షలు టీడీపీ తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి అందనుంది. దీనికి పర్యవసానంగా వైసీపీ ఎమ్మెల్యేలు 150 మంది తమ ఒక నెల వేతనం, 20 మంది ఎంపీలు నెల వేతనం ప్రకటించారు. దీని విలువ సుమారు రూ. 4 కోట్లు ఈ రూపంలో అందనుంది. ఇక సినీ పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్ ఇరు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ప్రకటించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రకటించారు. ఇలా సినీ, రాజకీయ విభాగాల నుండి దాతృత్వం పొంగుతుంది. కానీ కార్పొరేట్, సినీ దిగ్గజాల నుండి ఏ మాత్రం వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నర్ధకం. దేశం, రాష్ట్రం అల్లాడుతున్న ఆ తరుణంలో స్పందించి సాయం అందిస్తేనే వైద్య సేవలు మెరుగయ్యేది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!