సోషల్ మీడియాలో ఆ మధ్య ఓ సందేశం విపరీతంగా ప్రచారంలో ఉండేది…!
దాన్ని “పాండవులు పాండవులు తుమ్మెద” అనే సినిమాలో మోహన్ బాబు డైలాగులుగా కూడా వాడారు..!! “బాగా చదువుకున్నోళ్ళు ఐఏఎస్, ఐపీఏస్ లు అవుతారు. మధ్యస్థంగా చదువుకున్న రాజకీయ నాయకుల కింద పని చేస్తారు. వీళ్ళు ఏమి చదువుకొని స్వామీజీల కింద పని చేస్తుంటారు..” అనేది ఆ సారాంశం.ఇప్పుడు మీడియా సంగతి ఏంటి…? మీడియాలోనూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వారి సంగతేంటి..? ఆయన రాజకీయ నాయకుడా..? స్వామిజినా..? ఇంకేమైనా విభిన్న వర్గమా..?? ఈ సందేహం ఎందుకు అనుకుంటున్నారేమో…! ఈరోజు ఆయన “కొత్త పలుకు” లో కులుకులు చదివితే అదే అనిపిస్తుంది. అందులో కొన్ని చూద్దాం పదండి…!!
ముందుగా చెప్పుకోవాల్సింది “చిన్న బుద్ధులు” గురించే…!!
ఏబీఎన్ రాధాకృష్ణ తెగ ఆవేదన చెందుతున్నారు. చాలా మధన పడిపోతున్నారు. ఎందుకంటే…!! “కల్నల్ సంతోష్ వీరత్వానికి.., సోనూ సూద్ దాతృత్వానికి కులం అద్ది ఆయా కులస్థులు ప్రచారం చేసుకుంటున్నారు” అని ఆవేదన పడుతూ తన పలుకుల్లో రాశారు.
తన సంస్థలో చేసేదెవరు…??
పెద్ద మీడియా సంస్థ నడుపుతున్న రాధాకృష్ణ లో తన సంస్థలో ఎంతమంది ఇతర కులస్థులు ఉన్నారు…? తెలంగాణ బ్యూరో ఇంచార్జి వల్లభనేని సురేష్ ఏ కులం..? ఏపీ బ్యూరో ఇంచార్జి మాధవరావు ఏ కేవలం..? ఏపీలోనూ అనేక జిల్లాల్లో ఉన్న ఇంచార్జిలు ఏ కులం..? తన ఛానెల్ లో డిబేట్ నిర్వహించే వెంకటకృష్ణ ఏ కులం..? రాధాకృష్ణ నెల నెల జీతాలుగా ఇచ్చే 2 కోట్లలో సుమారుగా కోటిన్నర తన కులస్తులకు వెళ్తుంది. అంటే పెద్ద స్థాయిలో ఉన్న 75 శాతం ఉద్యోగులు తన కులస్తులే అనే విషయాన్నీ కూడా రాధాకృష్ణకి గుర్తులేదేమో…!!
నాడు ఏమయ్యాయి ఈ పలుకులు..??
చంద్రబాబు కమ్మ కులం కాబట్టే కదా ఆర్కే ఆ పార్టీని, ఆయనను బాకా ఒడ్డుతున్నారు. తన సామజిక వర్గానికి ఏమి కాకూడదని ఎన్ని లాబీయింగులు చేయలేదు. “మరి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ,తెనాలి MLA ఆళ్ళ నరేంద్ర పాల్గొన్న కమ్మ సభలో వక్తలు” కమ్మోళ్ల రక్తం ఎక్కించుకొంటే చిరంజీవి సీఎం అయ్యేవాడు . బ్రహ్మ విష్ణు శివుడు మన కమ్మోల్లె అన్నపుడు కానీ మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల మా కమ్మోడే” అన్నప్పుడు ఈ పలుకులు ఏమయ్యాయి..??
స్వామిజి అవతారం ఎత్తాల్సిందే ఆర్కే…!!
ఇక ఆర్కే స్వామిజి రాసిన మరి కొన్ని పలుకులు ఇక్కడ చర్చించుకోవాల్సిందే…! ఆరేళ్ళ కిందటే విభజన ఖాయం మీకేది కావాలో తీసుకోండి” అని ఆయన చెప్పినా నాయకులు వినలేదట. మూడేళ్ళ కిందట కూడా “హోదా రాదు… ప్యాకేజీ తీసుకోండి” అని చెప్పినా వినలేదట. పాపం అందుకే…! పైన ఒక చర్చతో ఈ కథనం ఆరంభించాము. మీరు రాజకీయ నాయకుడు కాదు, స్వామిజి కాదు. మీడియా.., అందులోనూ ఒక కుల మీడియా…! అందుకే అర్జంటుగా మీకున్న అపార జ్ఞాన సంపత్తితో “స్వామిజి” అవతారం ఎత్తేస్తే మీ మాట అందరూ వింటారేమో ఆలోచించండి ఆర్కే గారు…!
మూడు ముక్కలాట గురించి అనవసరం…!!
ఇక మిగిలిన కథనం మొత్తం అమరావతి గొప్పతనం, రైతుల త్యాగం.., చంద్రబాబు అపార జ్ఞానం తెలివి, పాలన గురించి ఆర్కే పలికారు. జగన్ పాలన, మూడు రాజధానుల ఆలోచనపై తనకు తోచినట్టు, తన అంటారా ఉద్దేశాన్ని వివరిస్తూ… చంద్రబాబుకి నచ్చేలా, ఆ వర్గానికి మెచ్చేలా రాసుకొచ్చారు. దీని గురించి చర్చ అనవసరం. అది ఆయన ఉద్దేశం. ఆయన ఇష్టం.
ఆయన పత్రిక. ఆయన రాతలు. చదివేది, మోసేది, నమ్మేది, ఉమ్మేది వారి వర్గమే. ఆ విషయాలు పక్కన పెట్టి కేవలం ఆయన అపార జ్ఞాన సంపత్తితో చెప్పిన కొన్ని మాటలు, కులం గురించి చిన్న బుద్ధులు అంటూ రాసిన మాటలను గురించి మాత్రమే మనం ఇక్కడ చెప్పుకోవాలి. లేకపోతే ఆయనకు రావాల్సిన అవార్డులు పోతాయేమో. అందుకే ఆయన ఏదైనా అవార్డు ఇవ్వండయ్యా… అటువంటి మేధావిని ఊరికే వదలకూడదు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!