రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులకు ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ కొత్త పలుకులు కొత్తేమీకాదు. అతని పత్రికలో వెలువడే వ్యాసం ఎప్పుడూ చంద్రబాబు ని పొగుడుతూ జగన్ ను కించపరుస్తూ నవ్యాంధ్ర, అమరావతి అంటూ వాటి చుట్టూనే తిరుగుతుంది. అయితే మొట్టమొదటిసారి ఒక నిఖారసైన జర్నలిస్టు లాగా రాధాకృష్ణ వ్యాసం రాశాడు అంటే ఎవరైనా నమ్మగలరా…??
వివరాల్లోకి వెళితే…. ఎక్కడా సంయమనం కోల్పోకుండా…. నేలవిడిచి సాము చేయకుండా దుబ్బాక ఉప ఎన్నికను అన్ని కోణాల్లో టచ్ చేస్తూ రాధాకృష్ణ పూర్తిగా తెలంగాణ రాజకీయాల పై ఒక వ్యాసం రాశారు. ఇతర మీడియా సంస్థల గా తెలంగాణలో కేసీఆర్ ను తెగ పొగిడేసింది లేదు…. అలాగని తెలంగాణ ముఖ్యమంత్రి పై గుడ్డి వ్యతిరేకత కనబరిచింది కూడా లేదు. జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయి విశ్లేషణను సూటిగా నిష్పక్షపాతంగా చెప్పడమే హైలైట్. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక నుండి ఈ మాత్రం ఆశించడం నిజంగా ఎక్కువే…. అది కూడా మన రాధాకృష్ణ నుండి.
ఇక ఎంతో సాఫీగా మంచినీళ్లు తాగినంత సులువుగా ఉప ఎన్నికలలో జనాలను తమ వైపు తిప్పుకునేందుకు అన్నీ ప్లాన్ చేసుకునే టిఆర్ఎస్ కు మొట్టమొదటిసారి దుబ్బాక రూపంలో ప్రతిఘటన ఎదురు పడుతోంది. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఎన్నికను రాజకీయ పార్టీలు సహకరించుకోవాలి ఒక ఆనవాయితీ కి టిఆర్ఎస్ గతంలో గండి కొట్టింది. అయితే ఇప్పుడు అదే వారికి దిక్కయింది. రామలింగారెడ్డి భార్యను అభ్యర్థిగా ఎంపిక చేసి అతని కొడుకును దూరంగా పెట్టారు. ఇక ఈ వ్యవహారం మొత్తం హరీష్ రావు దగ్గరుండి నడిపించారు. జనంలో వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఒక పెద్ద పన్నాగం వేశారు. బిజెపి ని వేటాడి అన్ని వ్యవస్థలను ఉసిగొల్పారు. అయితే గతంలో లాగా బీజేపీ ఈసారి ఏమి బలహీనంగా లేదు…. చాలా ఏళ్ల తర్వాత సై అంటే సై అన్నట్లు నిలబడింది.
ఇదంతా పక్కన పెడితే టిఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ వైపు కాకుండా బిజెపి వైపు మళ్ళేందుకు కూడా హరీష్ రావ్య్ స్వయంకృతాపరాధమే కారణమని అంటున్నారు. అంతిమంగా టిఆర్ఎస్ గెలవచ్చు కానీ తమకు మంచి బలమును నియోజకవర్గాల్లో మరి ప్రత్యేకించి హరీష్ సిద్దిపేట నియోజకవర్గం, కేసీఆర్ గజ్వేల్ పక్కనే ఉండే వాటి ప్రభావం కనిపించే దుబ్బాకలో కూడా వారికి భారీగా నెగిటివిటీ వచ్చేసింది. పార్టీ నాయకులు లోగుట్టు వ్యవహారాలు, వరద సహాయం పంపిణీలో చేతివాటం, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల చాలెంజ్ ఇప్పుడు టిఆర్ఎస్ గ్రేటర్లో ఎన్నో డౌట్లు రేకెత్తిస్తున్నాయి.
ఇలా రాధాకృష్ణ పాయింట్లు పాయింట్లు రాసుకుంటూ పోతున్నాడు…. ఎటొచ్చి మళ్ళీ ఏపీ గురించి రాయడానికి ప్రయత్నిస్తే తెలుగు దేశం వీర విధేయుడు మేల్కొంటాడు. అది జనాలకు నచ్చట్లేదు…. ఇక ఆర్కె మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఇలా నిష్పక్షపాతంగా రాయడం పాఠకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది అనే చెప్పాలి..!