ABN Venkatakrishna : 90 శాతం జర్నలిస్టులకు భావజాలం, నిబద్ధత కంటే అహం.. ఆకలి.. ఎక్కువుంటుంది. స్థాయిని బట్టి అది మారుతూ వస్తుంది. మండల స్థాయి గ్రామీణ జర్నలిస్టు అయితే పరిమితంగా.., జిల్లా స్థాయి బ్యూరో అయితే స్థిమితంగా.. రాష్ట్రస్థాయిలో బ్యురోగా ఉంటే అపరిమితంగా… ఇక డిబేట్లుతో రోజూ ఛానెళ్లలో కనిపిస్తుంటే బీభత్సంగా ఉంటుంది. యాజమాన్యాలకు ఓ గౌరవం పడేసి.., అదే వేదికపై సొంత నెట్వర్క్ పెంచుకుని.., రోజువారీ భజనలు చేసుకునేలా ఉంటుంది..! రోజూ టీవీల్లో కనిపిస్తున్న మూర్తి, రజనీ కాంత్, వెంకటకృష్ణ, సాంబశివరావు, వంశీకృష్ణ ఈ అందరూ ఇదే కోవకు వస్తారు. వీళ్లకు ఆయా ఛానెళ్లలో సొంత నెట్వర్క్, భజన బృందం ఉంటుంది..! వీళ్ళు ఛానెల్ మారితే వాళ్ళు కూడా మారుతూ వస్తారు. ఇది వారి సొంత టీమ్, అనధికార లావాదేవీలు, అసాంఘిక బేరాలకు వీళ్ళను వాడుతూ ఉంటారు..! ఇవి సాధారణంగా బయటకు రావు.. కానీ ఏబీఎన్ వీకే విషయంలో మాత్రం వీళ్ళు బయటకు వచ్చేసారు..!
ABN Venkatakrishna : వీకే బృందానికి గట్టి పని పడింది..!!
గడిచిన నాలుగు రోజుల నుండి తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో ఏబీఎన్ వెంకటకృష్ణ గురించి బాగా చర్చ జరుగుతుంది. ఆయనను ఏబీఎన్ యాజమాన్యం తీసేసింది అని.. ఆయన బ్లాక్ మెయిల్ చేస్తూ దొరికిపోయారని.. ఆయన సొంతంగా ఛానెల్ పెడుతున్నారని.. వేరే చోటకు మారుతున్నారని… ఇలా రకరకాల స్టోరీలు వచ్చాయి. నిన్నటితో అవన్నీ ముగిసాయి. నిన్న మళ్ళీ వెంకటకృష్ణ ఏబీఎన్ లో ప్రత్యక్షమయ్యారు. డిబేట్ చేసారు. వైసీపీపై వాగ్బాణాలు వేశారు. దీనికి ముందు ఏబీఎన్ ఆర్కేతో ఒప్పందం కుదుర్చుకుని.. ఒక కాంప్రెమైజ్ సూత్రం పాటించి… చెడ్డ పేరు రాకుండా కొన్నాళ్ళు కొనసాగేలా మాట్లాడుకుని మళ్ళీ దూరారు. ఆర్కే – వీకే మధ్య ఏమైనా కానీ…, మొత్తానికి సోషల్ మీడియా.., ఓ వర్గం మీడియా ప్రచారం తప్పు అని వీకే నిరూపించగలిగారు..! ఇక్కడితో ఆయన బృందానికి పని పడింది.!!
భజన మెసేజ్ లతో నింపేస్తున్నారు..!!
ఇక వీకే టీమ్ విజృంభిస్తుంది. సోషల్ మీడియాలో తమకు తోచిన అన్ని గ్రూపుల్లో తమ బాస్ గొప్ప, తమ బాస్ మహాగోప్పోడు.. తెలుగులో అత్యుత్తమ జర్నలిస్టు.., జర్నలిజం జాతిలో ఆణిముత్యం.., కింది స్థాయి నుండి వచ్చారు.. ఈనాడులో పెద్ద కుర్చీ ఎక్కారు.. ఎంతో సాధించారు.. అంటూ ఓ పెద్ద మేటర్ తయారు చేసి వదిలేసారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే..!? సాధారణంగా రాజకీయులకు, వ్యాపార వేత్తలకు భజన బృందాలు ఉంటాయి.. వాళ్లపై ఏ బురద పడినా తుడిచే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ ఒక జర్నలిస్టుకి భజన బృందం ఉండడం.. వీకేపై బురద తుడిచే ప్రయత్నం చేయడమే విడ్డురం. జర్నలిస్టుకి తన స్వరం – తన కలం మాత్రమే పని చేయాలి. వాటి ద్వారానే బురద తుడుచుకోవాలి. కానీ తెలుగు మీడియాలో మొదటిసారి ఓ జర్నలిస్టు తోక బృందం అదనపు తోక తగిలించుకుని భజనలు చేస్తుంది. ఇదే జర్నలిజాన్ని .. దానిలో ఇజాన్ని దారిమళ్లిస్తుంది. బజారుకి ఈడుస్తుంది..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!