ఏం..? చంద్రబాబుకేనా మీడియాలున్నది..? జగన్ కి లేవా..?
బాబుగారి మీడియాకేనా సుప్రీం మాజీలు తెలిసేది..? జగన్ మీడియాకి తెలియరా..?
ఆంధ్రజ్యోతేనా మాజీల ఇంటర్వ్యూలు వేసి, తమ వాదన వినిపించేది..! సాక్షి చేయలేదా ఏమిటి..?? తమ వాదన వినిపించడానికి, తమ వర్గంని సంతృప్తి పరచడానికి…, ఆంధ్రజ్యోతి పట్టుకుని, ఇంటర్వ్యూ తీసుకుని, పేజీలు, పేజీలు వేసినట్టు.., సాక్షి కూడా తమ వాదన కోసం, తమ వర్గం సంతోషం కోసం ఒకర్ని పట్టుకోలేదా..? ఇంటర్వ్యూ చేయలేదా..? పేజీలు, పేజీలు పబ్లిష్ చేయలేదా..??
“కళ్ళు చల్లబడే ఇంటర్వ్యూ”ల రోజులివి…!!
హతవిధీ…!! తెలుగు మీడియాలో నిఖార్సైన వార్తలు, ఇంటర్వ్యూలు ఏనాడో పోయాయి. ఒక పెద్దాయనని కలిసి.., “మీ ఇంటర్వ్యూ కావాలి, పబ్లిష్ చేస్తాం, ఉన్నదీ ఉన్నట్టు చెప్పండి” అని అడగడం వేరు.., ఆ రోజులు పోయాయి. “మీరు ఇలా మాట్లాడాలి, ఈ వాదన రావాలి, ఇలా ఇస్తాం… బీభత్సమైన కవరేజీ ఇస్తాం” అంటూ జర్నలిజం ఏనాడో దిగిపోయింది. ఈ క్రమంలోనే “ఆంధ్రజ్యోతి”లో ఈరోజు ఒక సుప్రీం మాజీ పెద్ద ఇంటర్వ్యూ ప్రచురించారు. వైసీపీకి వ్యతిరేకంగా.., ఆ ప్రభుత్వ నిర్ణయాలు తప్పు అన్నట్టు.., ఆ నిర్ణయాలేమి కోర్టుల ముందు నిలబడవు అన్నట్టు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించారు. ఏమో అవి నిజమో.. కాదో చెప్పలేం.., కానీ ఆ వార్తా, ఆ ఇంటర్వ్యూ మాత్రం కొన్ని కళ్ళు చల్లబడడానికే..! అవి చదివిన టీడీపీ, బాబు భజన బృందం కళ్ళు చల్లబడి ఉంటాయి. ఏబీఎన్ ఆర్కే కడుపు నిండి ఉంటుంది.
సాక్షి కూడా ఉందిగా.., వాళ్ళ కళ్ళు చల్లబడాలిగా…!!
ఆంధ్రజ్యోతిలో ఈరోజు వార్త వచ్చింది. సో.., దానికి విరుగుడుగా సాక్షిలో రేపో, మాపో ఓ పెద్ద వార్త వస్తుంది. ఓ పెద్దాయనని కలిసి ఇంటర్వ్యూ ఇస్తారు. అదే ప్రయత్నంలో ఉన్నారు. ఆ వర్గం, ఆ పార్టీ, ఆ మీడియా కళ్ళు చల్లబడినప్పుడు… మరి ఈ మీడియా, ఈ వర్గం కళ్ళు కూడా చల్లబడాలిగా…! ఆ ప్రయత్నమే ఇప్పుడు https://newsorbit.com/tag/sakshiసాక్షి చేస్తుంది. “హాట్..! రాజధాని నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదు. రాజ్యాంగంలోని ఈ పాయింటు, ఆ పాయింటు ప్రకారం రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే. టీడీపీ ప్రభుత్వం హయాంని రాజధాని అమరావతిలో అక్రమాలు జరిగాయి. ఈ సెక్షన్ ప్రకారం అమరావతి నిర్ణయం చెల్లదు” అంటూ చెప్పిస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు, ప్రచురిస్తారు. అదన్నమాట…! తెలుగు మీడియా పరిస్థితి.!
రాజధాని విషయంలో మొదటి నుండి ఇంతే..!!
తెలుగు మీడియాలో ఈ సంస్కృతి ఏ నాటి నుండో ఉంది. ఒకరికి వ్యతిరేకంగా, మరొకరు ప్రచురించడం. అది నేరుగా కాకుండా ఎవరో ఒకర్ని మధ్యలో పెట్టి ఇస్తుంటారు. దీనిలో భాగంగా ఆ మీడియాలు రంగులు కూడా పోసుకున్నాయి. “ఎల్లో అనీ, బ్లూ అని” అనుకుంటున్నాయి.
ఇక సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నప్పటి నుండీ వార్తల వడ్ఢయింపులు మొదలయ్యాయి. ఒకరోజు అమరావతి గడిచిన మూడేళ్ళలో బీభత్సంగా అభివృద్ధి చెందింది, ఈ భవనాల పరిస్థితి ఏమిటి..? అని “ఈనాడు”లో ప్రచురిస్తే… ఆ తర్వాత రోజున “అమరావతి అంతా ఎడారే..! అభివ్రిద్ది లేదు” అంటూ సాక్షిలో వార్త వస్తుంది. ఒకరోజు “విశాఖకు తుపాన్లు ముప్పు” అంటూ ఈనాడులో వస్తే.. ఆ తర్వాత రోజున “అమరావతి”కి వరదల ముప్పు అంటూ సాక్షిలో వస్తుంది. ఇవన్నీ తమ తమ వర్గ, నాయక, రాజకీయ ప్రయోజనాలకే తప్ప పాఠకులు, ప్రజలు అంటూ పెద్దగా పట్టింపులు ఉండవు. అందుకే “లక్జరి హోటల్ నుండి నడిరోడ్డు మీదకు” తెలుగు మీడియా దిగింది అనేది..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!