AP Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పొత్తుల గురించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ చెప్పేశారు. జనసేన – టీడీపీతో బీజేపీ కలిస్తే వీళ్లకు నష్టం ఉందా..? లేదా..టీడీపీ అసలు బీజేపీతో కలవాలి అనుకుంటుందా.. ? లేదా..? అనేది పరిశీలిద్దాం.. బీజేపీతో టీడీపీకి రాజకీయ అవసరాలు ఏమి లేవు. బీజేపీకి ఓటింగ్ బలం ఉందనో, నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లు చీల్చేస్తుందో అన్న భయం టీడీపీకి లేదు. కానీ బీజేపీతో వ్యవస్థీకృతమైన భయం టీడీపీకి ఉంది. బీజేపీ తన చేతిలో వ్యవస్థల ద్వారా 2019లో దెబ్బతీసినట్లుగా చేస్తుందనీ, వైసీపీకి పరోక్షంగా సహకరిస్తుందని టీడీపీకి భయం ఉంది. టీడీపీ ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తుందనే భయం ఉంది. బీజేపీకి రాజకీయంగా రాష్ట్రంలో బలం లేకపోయినా తన ఆధీనంలో ఉన్న వ్యవస్థల ద్వారా జగన్మోహనరెడ్డిని కంట్రోల్ చేసి టీడీపీకి స్వేచ్చను ఇస్తే చాలు. అది టీడీపీకి బీజేపీతో అవసరం. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి జనసేన, బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అలా చేస్తే బీజేపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీపై పడుతుంది.
Read More: TDP Janasena: ఆ పొత్తులపై టీడీపీలో భయం భయం..! జనసేనతో పేచీలు టీడీపీ టెన్షన్..!?
AP Politics: ముస్లిం మైనార్టీ నియోజకవర్గాల్లో
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు డామినేటెడ్ గా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేనకు నష్టం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా అయిదు నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే డామినేషన్. దాదాపుగా 40 – 45 వేల ఓట్లు వాళ్లవి ఉంటాయి. కడప జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగు నుండి అయిదు నియోజకవర్గాల్లో వాళ్లదే ఆధిపత్యం. అలానే అనంతపురం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో వాళ్ల డామినేషన్ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో రెండు, గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 15 నుండి 18 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. వీళ్లు బీజేపీతో పొత్తు ఉన్న కూటమికి మద్దతు ఇవ్వరు. వాస్తవానికి ఏపిలో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా ఉంది. ఇప్పుడిప్పుడే కొంత మంది టీడీపీకి టర్న్ అవుతున్నారు. ఇటువంటి తప్పులు చేయడం వల్ల ఈ కూటమికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీపై ఉన్న రాజకీయ వ్యతిరేకత టీడీపీ మీద పడుతుంది. అందుకు టీడీపీ భయపడుతోంది.
AP Politics: గత ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ చేయలేక..
2019 ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు డబ్బులు పంచలేక చేతులు ఎత్తేశారు. ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ కీలకం. ఎన్నికల సమయంలో కార్పోరేట్ సంస్థల నుండి రాజకీయ పార్టీలకు ఫండింగ్ వస్తుంటుంది. టీడీపీ చరిత్రలో మొదటి సారి 2019 ఎన్నికల్లో వాళ్లకు రావాల్సిన కార్పోరేట్ ఫండింగ్ ఆగిపోయింది. అలా అపిన శక్తులు కొన్ని ఉన్నాయి. టీడీపీ ఆర్ధిక మూలాలపై దెబ్బపడటం వల్ల ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. దాదాపు 20 నుండి 25 నియోజకవర్గాల్లో టీడీపీ డబ్బులు పంపిణీ చేయలేక దారుణంగా దెబ్బతింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బీజేపీతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కలిసి పోటీ చేస్తే ఒక దెబ్బ, కలిసి పోటీ చేయకుండా మరో దెబ్బ. దీంతో టీడీపీ కొత్త రకం టెన్షన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన, బీజేపీ, టీడీపీ తో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ కారణాల వల్ల ఇప్పుడప్పుడే ఈ వ్యవహారాలు తేలవు.