Work from Home: కరోనా కష్టకాలం తరువాత పరిస్థితులు చాలా మారిపోయాయి. లాంగ్ టైం లాక్ డౌన్ కొనసాగటం వలన దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ బాట పట్టాయి. ఇక ఎవరికి వారు తమ ఊళ్లకు వెళ్లి ఎంచక్కా ఇంటినుండే ఆఫీస్ పనులు చేసుకొనేవారు. లాక్ డౌన్ తీసేసిన తరువాత కూడా కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ని కొనసాగిస్తున్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే ఉద్యోగులకు వారికి నచ్చినట్టు వర్క్ చేసే అవకాశాన్ని కలిగించాయి. ఈ క్రమంలో 50 శాతం మంది ఇళ్లకే పరిమితం అయ్యి తమ వర్క్ ని కొనసాగిస్తున్నారు.
Pawan Kalyan: పవన్ పై కోపాన్ని ప్రభుత్వం నిజంగా సినిమాలపై చూపిస్తోందా?
అసలు విషయం ఏమిటి?
మనకు తెలిసిందే. తాజాగా అన్ని మొబైల్ కంపెనీలు తమ రీఛార్జ్ల ధరలు ఓ 15 శాతం వరకు పెంచేసాయి. ఇప్పుడు అదే బాటలో బ్రాడ్ బ్యాండ్ ధరలు కూడా పెరగనున్నాయి. కొన్ని వారాలలో కేబుల్ ఇంటర్నెట్ బిల్లులు సుమారుగా 20 శాతం వరకు పెంచనున్నాయని వినికిడి. అంటే దాదాపుగా 50 రూపాయిల వరకు పెరగనున్నాయి. రెండు మూడు సంవత్సరాల వరకు ఉచితంగా సర్వీసులని అందించే రిలయన్స్ జియో కూడా టారిఫ్ ధరలు పెంచిన విషయం మనకు తెలిసినదే. అదే అదనుగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా తమ ప్లాన్ లను 20 శాతం వరకు పెంచేసాయి.
Prabhas: ఆ విషయంలో ప్రభాస్ తర్వాత నాగార్జునే ముందున్నాడు!
ఈ మోత ఎప్పటి వరకు ఉంటుంది?
కరోనా కష్టకాలం తరువాత చాలా కంపెనీలు ఉచితంగా లేదా అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సర్వీస్ లని అందించాయి. దాంతో సదరు కంపెనీలు కొంత నష్ట భారాన్ని మోశాయి. ఇపుడు పరిస్థితులు చక్కబడ్డాయి కనుక వారు కూడా టెలికాం బాటలో 20 శాతం వరకు తమ ప్లాన్ లను పెంచనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందరి మాట ఎలా వున్నా, అంతంత మాత్రం సంపాదన వున్న వారికి ఈ ప్లాన్స్ పెను భారంగా మారక తప్పదు.