తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గత ఐదేళ్ల పాలనలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే కృష్ణా జిల్లాకు ఆయన చేసింది చాలానే ఉంది. అన్ని జిల్లాల్లో మంత్రులను మార్చినప్పటికీ…. ఆ జిల్లా నుండి ఇద్దరికి ఇచ్చిన మంత్రి పదవులు మాత్రం ఆయన తన పాలనా కాలం మొత్తం కొనసాగించారు. అదీ కాకుండా కేబినెట్ లో కీలక పదవులైన డిప్యూటీ స్పీకర్ మరియు విప్ కూడా ఆ జిల్లాకు చెందిన నాయకులకే చంద్రబాబు కట్టబెట్టారు. ఇలా టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కృష్ణా జిల్లా నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అదే సమయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య చాలా వివాదాలు కూడా నడిచాయి.
కానీ గత ఏడాది సీన్ రివర్స్ అయిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా నాయకులు ఏమన్నా బాసటగా నిలుస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉండే నాయకుడు అయితే కనీసం పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టి కొన్ని నెలలు అయిపోయింది. వీరిలో చాలామంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా మంత్రి దేవినేని అప్పట్లో వన్ మ్యాన్ షో కొనసాగించగా ఇప్పుడు మాత్రం ఏదో నామ్ కె వాస్తు వైసిపి పార్టీ పై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు తప్పించి పార్టీ ఎదుగుదలలో సమర్థవంతంగా అతని కృషి అయితే కనిపించడం లేదు.
వీరందరి ప్రవర్తన చూస్తుంటే చంద్రబాబు కి ఎక్కడలేని బిపి వస్తుందని ఆ పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. అప్పట్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ టిడిపి బోర్డులో సభ్యుడిగా బాబు చాన్స్ ఇవ్వగా…. బుద్ధ వెంకన్న కు విప్ హోదాతో పాటు విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్ గా నియమించగా.. బుద్ధ ప్రసాద్ కి డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ ఇచ్చారు. వీరిలో మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పటివరకు ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చేయకపోగా.. కనీసం టిడిపి వాయిస్ కూడా బయటకు వినపడనివ్వని పరిస్థితి. ఇక బుద్ధ వెంకన్న, బోండా ఉమ మీడియాతో టచ్ లో ఉంటూ ఉన్న కూడా జిల్లాలోని పార్టీ నేతలందరినీ కలుపుకొనిపోయి ఒక శక్తిగా ఎదిగింది అయితే ఏమీ లేదు.
ఇక గన్నవరం నుండి గెలిచిన వంశీ అయితే ఏకంగా పార్టీని వదిలి వెళ్ళిపోయాడు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. కరోనా నేపథ్యంలో ఆయన దీక్షకు దిగినా అది పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత వృథా కాగా.. పార్టీలో సీనియర్లను హైకమాండ్ వేధిస్తుండడంతో గమనార్హం.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!