తెలుగునాట మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు…! ఏ పార్టీకి ఆ మీడియా.., ఏ నాయకుడికి ఆ భజనలు మీడియాలు ఉన్నాయి…! తమ నాయకున్ని పొగిడి.., తమ అక్షరాలతో అభిషేకం చేసి.., ఎదుటి నాయకుడిపై విషం చిమ్మడమే ఈ మీడియాల పని. మీడియాలో ఈ పాత్ర ఎక్కువగా నిర్వర్తించేది ఆంధ్రజ్యోతి, ఈనాడు, ABN ఛానెల్, టీవీ 5 చానెళ్లు. సాక్షి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. దాని పుట్టుకే నాయకుడి భజన!!
ప్రభుత్వంపై ఎడాపెడా తోచినట్టు రాస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి జగన్ ప్రభుత్వం ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ వార్త కథనంపై స్పందించిన సీఎం కార్యాలయం… ఏకంగా “మీ వార్త.., ఆ ఆసుపత్రి బిల్లు సరైనదేనని నిరూపించాలని” సవాలు చేసింది. ఆ వార్తా ఏమిటో.., అసలు విషయం ఏమిటో.., చూద్దాం..!
శరీరంపై గాయాలకు రూ. 19 లక్షలు…!
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ప్రాంతానికి చెందిన వీరనాగరాజు అనే యువకుడు గత ఏడాది విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. అప్పుడే హైదరాబాద్ లోని వి కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా ఏడాది తర్వాత ఆ ప్రమాదహెమ్ తిరగదోడడంతో మళ్ళీ ఆసుపత్రిలో చేరారు. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకిందని…, పూర్తిస్థాయి చికిత్సకు రూ. 19 లక్షలు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇంత డబ్బు పెట్టుకోలేక బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరకాస్తు చేశారు.
రూ. 5 లక్షలు అని ప్రభుత్వ పరిశీలన…!
సీఎం కార్యాలయంలో ఈ ఎస్టిమేషన్ ని పునః పరిశీలించి, వేరే ఆసుపత్రులతో ఆరా తీస్తే రూ. 5 లక్షలకే చికిత్స మొత్తం పూర్తవుతుందని సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. ఇదే విషయాన్నీ సీఎం కార్యాలయం కూడా బాధిత కుటుంబానికి తెలియజేసి, అపోలోలో లేదా, గ్లోబెల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఇక్కడే abn , ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది.
పూర్తిగా తెలుసుకోకుండా బురద రాతలు…!!
రూ. 19 లక్షల వైద్యాన్ని రూ. 5 లక్షలకు అంటే ఎవరైనా తక్కువ ఎస్టిమేషన్ ఇచ్చిన ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారు. ఏపీ ప్రభుత్వం కూడా అదే చేసింది. కానీ ఇక్కడే ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. “ప్రభుత్వం చెప్పిన ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలట, కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం కుమ్మక్కు” అంటూ రాతలు రాసింది. మంచిదే మాంచి ఇన్వెస్టిగేషన్ కథనం.., ప్రభుత్వ అవినీతి బయటపెట్టే కథనం…! కానీ ఆంధ్రజ్యోతి చేసిన తప్పు ఏమిటంటే… “ప్రభుత్వం సూచించిన ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు… అని మాత్రమే కథనం అల్లిన ఏబీన్ ఆంధ్రజ్యోతి అలా ఎందుకు అంటున్నారు..? వి కేర్ లో రూ. 19 లక్షలు అంటున్నది.., ఇక్కడ రూ. 5 లక్షలు ఎందుకు…? ఒకే తరహా వైద్యానికి రూ. 14 లక్షలు ఎందుకు తేడా వస్తుంది…? అని ఆరా తీయాలి. తెస్తేనే, నిజమైన జర్నలిజం..!! కానీ అది మర్చిపోయి ప్రభుత్వంపై బురద చల్లే పనిలో రాతలు రాసింది. మరో కీలక పాయింటు…! అదే రూ. 19 లక్షలకు ప్రభుత్వం వేరే ఆసుపత్రిని సూచిస్తే తప్పు పట్టాలి, రాయాలి… కానీ 14 లక్షలు తగ్గినప్పుడు అసలు రాయాల్సిన అవసరమే లేదు. దురుద్దేశ, తప్పుడు కథనం వండి, వడ్డించింది.
సీఎంఓ ఓపెన్ సవాల్…!
ఇక ఈ రాతలపై సీఎం కార్యాలయం ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. రూ. 19 లక్షలకు అంటూ వి కేర్ ఆసుపత్రి ఇచ్చిన ఎస్టిమేషన్ నిజమే, అన్ని సత్యాలే అని ఎక్కడైనా ఖరారు చేసుకుని రావాలని… ఛాలెంజ్ చేసింది. పూర్తి వివరాలతో కూడిన స్టేట్ మెంట్ ఇచ్చారు. వి-కేర్ ఆస్పత్రి వేసిన ఎస్టిమేషన్ సరైనదేనని ఇతర ఏ ఆస్పత్రితో అయినా నిరూపించాలని ఏబీఎన్ కి ఓ పెన్ ఛాలెంజ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి ఈ తరహాగా ఎక్కువగా ఎస్టిమేషన్ ఇస్తున్నారని… నకిలీ ఆస్పత్రుల వలలో పడొద్దని బాధితుకు సూచించారు. అదే సందర్భంలో పత్రికకు సవాలూ విసిరారు.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!