నాలుగున్నర దశాబ్దాల చరిత్ర..
వెలుగులో లక్షలాది పాఠకుల గొంతుక..
చీకట్లో ఓ సామజిక వర్గం/ ఓ పార్టీకి నీడ…
వేలాది మందికి ఉపాధినిచ్చిన పత్రిక…! చివరికి ఏమవుతుంది..? చివరికి ఏమయ్యింది..? లే ఆఫ్ కి వచ్చింది, ఆ లే ఆఫ్ కూడా సరిగా అమలు చేయకుండా డొంకతిరుగుడు వ్యవహారాలతో తమ చరిత్రపై తనే మసి పూసుకుంటుంది..!!
“ఈరోజే ప్రభుత్వంలో/ అధికార పార్టీలో ఓ పెద్దాయనను కలిసాను. ఏమయ్యా..! నువ్వు ఈనాడులో చేసావు కదా..?? నాలుగు దశాబ్దాలు చరిత్ర ఉంది, బాగానే సంపాదించారు కదా…? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు కదా…? మరి ఏనాడైనా ఉద్యోగులకు లాభాల్లో షేర్ ఇచ్చారా…? మరి ఇప్పుడేంటి నష్టాలు అనే జీతాలు కోసేస్తున్నారు. ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు. అసలు బుద్దుందా లేదా..? ఆ యాజమాన్యంకి..??” అన్నారు. నిజమే..!! గడించిన లాభాలు ఏమైనట్టు..? నాలుగు నెలల నష్టాలకు తట్టుకోలేనంతగా పత్రిక దిగజారిందా..? అనేదే ప్రశ్న.
సరే ఆ పెద్దాయన ప్రశ్న, ప్రస్తావన వదిలేద్దాం. “ఈనాడుకు, ప్రభుత్వానికి పడదు కాబట్టి అలా అన్నారు అనుకుందాం”…! ఈనాడులో గడిచిన నాలుగు నెలలుగా ఏం జరుగుతున్నట్టు..? ఎంత మంది ఉద్యోగులు రోడ్డున పడినట్టు..? ఎంత మందికి లే ఆఫ్ ఇచ్చినట్టు..? లేబర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు..? ఈనాడు తెరచాటు వ్యవహారాల్లో ఎందుకు ఇన్నాళ్లు తల దూర్చనట్టు..??
లే ఆఫ్ లోనూ ఎన్ని లొసుగులో…!!
లే ఆఫ్ అంటే ఏంటి..? కంపెనీ నష్టాల్లో ఉంది. జీతాలు ఇవ్వలేము, నిర్వహణ కష్టంగా ఉంది, కొన్ని రోజులు మీకు కష్టాలు, కోతలు తప్పవు అని అర్ధం. ఈనాడు కూడా అదే చేసింది. కానీ ఆ యాజమాన్యం తమకున్న పైత్యం, అతితెలివి జోడించి లే ఆఫ్ నోటీసులు ఇచ్చారు. లే ఆఫ్ అనేది ఒకటో తేదీన ఇవ్వాలి. కానీ ఈనాడు జూన్ – 8 న ఇచ్చింది. ఒకటో తేదీ లోగా సంబంధిత శాఖ (లేబర్ కార్యాలయాల్లో) ఇవ్వాలి, అంటే మేము నష్టాల్లో ఉన్నాం.., మా ఉద్యోగులకు కష్టాలు తప్పవు అని ముందుగానే తెలియాజేయాలి. కానీ ఈనాడు జూన్ 8 న ఇచ్చింది. కానీ ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్టు, పాయింటు ఉంది.
* ఈనాడులో (ఉషోదయ ఎంటర్ ప్రైజెస్)లో ఉన్న ఉద్యోగులు అందరూ హైదరాబాద్ కేంద్రంగానే లెక్కల్లో ఉన్నట్టు. వారి వేతనాలు, లావాదేవీలు అన్ని అక్కడి నుండే ఆపరేట్ చేస్తారు. కేవలం అటెండేన్స్ మాత్రమే జిల్లాల్లోని కార్యాలయాల్లో ఉంటుంది. కానీ ఈనాడు ఏం చేసిందయ్యా అంటే..?? “తమ లే ఆఫ్ నోటీసులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో లేబర్ కార్యాలయాలకు ఇచ్చింది. నిజానికి హైదరాబాద్ లోని రాష్ట్ర స్థాయి కార్యాలయంలో ఇస్తే చాలు.
ఈనాడు తెలియక అలా ఇచ్చేసిందేమో అనుకుంటారేమో… తెలియక కాదు, తెలివితో ఇచ్చింది. లేబర్ శాఖ నిబంధనల ప్రకారం 1000 మంది ఉద్యోగులు దాటినా కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తే, ఆ ఉద్యోగులను తీసేస్తే కొంత పరిహారం ఇవ్వాలి. ఈనాడు యాజమాన్యానికి ఆ ఉద్దేశం ఉందొ, లేదో..? ముందే తెలివిగా తమకు తక్కువ మంది ఉద్యోగులే అని చెప్పుకునేందుకు వీలుగా జిల్లాల వారీగా నోటీసులు ఇచ్చేసింది. అయితే జూన్ ఒకటో తేదీలోగా ఇవ్వాలిగా అంటూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఈ నోటీసులను పక్కన పెట్టారని సమాచారం..! ఏపీలో మాత్రం ఇంకా పరిశీలనలో ఉన్నాయి.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!