వార్తలు అంటే “ఎప్పుడు, ఎక్కడ, ఎలా” అనే వివరాలు ఉంటాయి. అందులోకి ఈనాడు వార్తలు అంటే మరీ వివరంగా ఉంటాయి..! అది వార్తా ప్రపంచానికి వారు నేర్పిన పాఠాలే..! కానీ ఈనాడులో కనిపించిన ఓ వార్త కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. పాపం “దివంగత నేపథ్య గాయకుడు బాలుకి కరోనా పాపంలో రామోజీకి కొంత వాటా ఉండడం”తో కరోనా విషయంలో ఈనాడు కొంత అప్రమత్తమైనట్టు కనిపిస్తుంది. ఈ “అప్రమత్తత కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కాదు సుమీ.., తమ పత్రికలో రాసే వార్తల్లోనే”..! ఎందుకంటే.., కింద వార్త చుడండి. రజనీ కాంత్ తన తదుపరి చిత్రం “అన్నత్తై” షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. చిత్రీకరణలో కొందరికి కరోనా సోకింది, షూటింగ్ ఆపేసారు అని రాశారు. కానీ ఆ చిత్రీకరణ ఎక్కడ అనేది మాత్రం రాయలేదు. ఎందుకంటే..! అది వారి ఆస్థానమే.., రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర యూనిట్ కొందరికి కరోనా సోకింది..!
భుజాలు తడుముకొనుడు ఎందుకంటే..!?
ఇక్కడ ఈనాడునో, రామోజీరావునో తప్పు పట్టడం కాదు..! కానీ ఆ భుజాలు తడుముకొనుడుని మాత్రం చెప్పుకోవాల్సిందే. ఆ వార్తని, ఆ సమాచారంలో అసంపూర్తిని తప్పు పట్టాల్సిందే. ఎక్కడ చిత్రీకరణ జరుగుతుంది అనేది ఇవ్వకుండా పైపైన ఇచ్చేసారు. “బాలుకి కరోనా సోకినా పాపంలో చాలా వాటా ఈటివి యాజమాన్యంకి ఉంది. వారి కక్కర్తి, వారి నిర్లక్ష్యం, వారి వ్యాపార ధోరణి బాలుకి కరోనాకి కారణమయ్యాయి. అయితే రామోజీ అదృష్టం కొద్దీ.., పూర్తి సమాచారం, ఆధారాలు సోషల్ మీడియాకి దొరకలేదు.. దొరికితే ఆయన పరిస్థితి వేరేలా ఉండేది. వారి నిజస్వరూపం బయటకు వచ్చేసేది.
అలా బాలు గారికి కరోనాతో కొంత అప్రమత్తమైన ఈనాడు, ఈటివి యాజమాన్యాలు ప్రముఖులు తమ పరిధిలోకి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాయి. పూర్తిగా వార్తలు రాయడం లేదు. అయితే ఇప్పుడు రజనీకాంత్ కి కరోనా కాదు, ఆయనకు నెగిటివ్ వచ్చింది కాబట్టి పర్వాలేదు. పెద్ద కంగారేమి లేదు. లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. ఇటు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ, అటు అజాగ్రత్తగా ఉన్న చిత్ర యూనిట్ రెండు సమపాళ్లలో కారకులుగా మిగిలేవి..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?