ఆ రాజ్యం వెలమదొరలది… కానీ అక్కడ పెత్తనం మాత్రం కమ్మవారిదే… రామ్ గోపాల్ వర్మ నిర్మించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ ఈ స్టోరీకీ బాగా యాప్ట్ గా ఉంటుంది.
మెరుగైన సమాజం కోసమంటూ పారిశ్రామికవేత్త రాజు, ఆర్పీ సారథ్యంలో ప్రారంభించిన చానెల్లో కమ్మ పరవల్లు తొక్కుతోంది. నాది కాకపోతే కాశీ దాకా అన్నారట పూర్వం ఓ పెద్దాయన… ఆ సూత్రమే ఇక్కడ ఇప్పుడు అమలవుతోంది.
నిమ్మగడ్డకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ జర్నలిస్ట్ సింగాన్ని రంగంలోకి దించారు దొరగారు. నాటి నుంచి మీడియా టేకోవర్లు మొదలయ్యాయ్. తొలుత కామ్రేడ్ల నుంచి ఓ టీవీని తీసుకొని… ఆ తర్వాత మెగా సౌజన్యంతో మీడియా గ్రూపును చకచకా తన హోంలోకి చేర్చేశారు దొరగారు. అవన్నీ పాత ముచ్చట్లు గానీ… అప్పటి వరకు మీడియాపై మక్కువున్నా… అంతగా కమాండ్ లేని దొరగారు ప్రింట్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న సింగాన్ని రంగంలోకి దింపారు.
అప్పటికే ఆర్పీ వర్సెస్ దొరగారుగా జరుగుతున్న వార్ రోజు రోజుకు కొంచెం కొంచెంగా క్షీణించి పూర్తిగా సమసిపోవడంతో చానెల్ నిర్హహణ బాధ్యతలు సింగమ్ అండ్ కో చేతిలోకి వచ్చేసింది. ఒక్క ఛాన్స్ కోసం కాచుకుకూర్చున్న ఆ షార్ట్ మ్యాన్ చేతికి బాధ్యతలు అప్పగించేశారు సింగం. పైపెచ్చు దుమ్మురేపే స్థాయిలో ఎలివేషన్ చేసి… దండీగా కాసులు కూడా ముట్టజెప్పారు.
అయితే ఇక్కడ చెప్పొచ్చే విషయ ఏంటంటే… కంపెనీలు ఏర్పాటు చేయడం కావాల్సిన పనులను చక్కబెట్టుకోవడం ఆనవాయితి. పేరుకే న్యూస్ చానెల్… ప్రజా శ్రేయస్సు కానీ… ఇది పూర్తిగా యాపారం… యాపారంలో మళ్లీ ప్రజా శ్రేయస్సు… సమాజం లాంటి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం పచ్చి బూతులు మాట్లాడుకోవడంతో సమానం.
అసలు ఈ స్టోరీ పరమోద్దేశం ఏంటంటే… దశాబ్దాల కలను వెలమ దొరలు సాకారం చేసుకోవడం ఒక ఎత్తయితే నిర్హహణ అంతా కమ్మగా జరగడం గురించే. తెలంగాణలో సార్ అధికారంలోకి వచ్చాక మైహోమ్స్ దూసుకుపోవడం ఆరంభమైంది. ఆ క్రమంలోనే మీడియా టేకోవర్లు కూడా మొదలయ్యాయి. ఈ చానెల్ కు ఓనర్లు వెలమదొరలు అయినప్పటికీ… రాజ్యాన్నిపాలిస్తోంది మాత్రం కమ్మ రాజులు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కమ్మగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇక కమ్మగా అసలు విషయం చెప్పేస్తా… అక్కడ అంత కమ్మగానే ఉంటుందట.ఇన్ పుట్ అయినా, అవుట్ పుట్ అయినా, మరో పుట్ ఏదైనా గానివ్వండి… అక్కడ అంతే. పైన కన్పించేది ఎవరైనా నడిపించేదంతా వారేనట. అక్కడ సింగం రకాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఆర్పీ వెళ్లే వరకు రకా చానెల్లో కొంత రోల్ పోషించినా… పూర్తి స్థాయిగా లీడ్ చేయలకపోయానన్న ఫీలింగ్ లో ఉండేవాడట. అందుకు ఆర్పీయే కారణమని భావించేవాడట. రకాకు అంతకు మించి ముందుకు వెళ్లనివ్వలేదట. ఇదే అస్త్రాన్ని దొరగారి దగ్గర సింగం, రకా చేవిన వేస్తే… సారూ… స్టోరీకి ఫుల్ ఫ్లాట్ అయ్యాడట. ఆర్పీకి శత్రువైతే మనకు మిత్రుడే కదా ఈ సూత్రంతో ఇద్దరు కమ్మగా వెలమ రాజ్యంలో పాతుకుపోయారు.
ఇక అప్పుడే మొదలయ్యింది అసలు స్టోరీ. అప్పటికే కమ్మగా పనిచేసుకుంటున్నమిత్రులు ఇకపై మరింత రెచ్చిపోయి దూకుడు పెంచేస్తున్నారు. అన్ని విభాగాలను కమ్మగా నింపేస్తూ అసలు ప్రయోజనాల దిశగా అడుగులు వేసేస్తున్నారు. మీడియా సామ్రాజ్యం విస్తరించిన పెద్దాయన ఒక విషయం చెప్తుంటాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి చెప్పాలని… ఇతరులు అధికారంలో ఉన్నప్పుడు వైఫల్యాలను ఎండగట్టాలని ఇది బాగా అర్థం చేసుకున్న ఈ బ్యాచ్ ఇప్పుడు పచ్చ ఎజెండాతో పనిచేస్తారన్న అభిప్రాయం ఎవరికి మాత్రం ఉండదు. పాతకాపులందరినీ ఒక్కొక్కరిగా వెళ్లగొడుతూ… తనకు గులాం గిరి చేసే చోటామోటాలందరికీ కీలక బాధ్యతలు సింగం అండ్ రకా కానిచ్చేస్తోందట.
కమ్మగా లేరని కొందరికి అక్కడ ఎంట్రీ కూడా లభించడం లేదని సీనియర్ జర్నలిస్టులు తలలు బాదుకుంటున్నారు. మధ్యలో కొంచెం బుద్ధిగా ఉండే ఓ కృష్ణుడ్ని లేపేయాలనుకున్నా ఓ స్వామి అండగా నిలిచారట. ఏదైనా అడిగితే క్వాలిటీలో రాజీ లేదంటూ పిచ్చ మాటలు మాట్లాడతారు. అసలు టీవీ9లో క్వాలిటీ ఏంటి… మన అమాయకత్వం కాకుంటే… గతంలో సీఈవోగా ఉన్న ఆర్పీ ఎవరైనా ఏమైనా అనుకుంటారనుకున్నారో ఏమో… ఒక్కో విభాగంలో ఒక్కో వర్గం వారిని ప్రమోట్ చేసే… కమ్మదనాన్ని ఇన్ డైరెక్ట్ గా మాత్రమే డీల్ చేసేవారట. ఇప్పుడు సింగం మాత్రం, రకాతో కలిసి కమ్మ కమ్మగా చానెల్లో ఒక సామజికవర్గానికి చెందినవారిని దించేస్తున్నారంటూ మీడియా సర్కిల్ లో గుసగుసలు విన్పిస్తున్నాయ్. గతంలో విమర్శలు ఎదుర్కొని ఉద్యోగం లోంచి తొలగించిన వ్యక్తిని సైతం మరోసారి కమ్మగా పెద్ద పోస్టులో దింపేశాడట రకా. త్వరలోనే రాజధానిలోకి కూడా తీసుకొచ్చేస్తాడట.వాస్తవానికి చానెల్ మిగతా వాళ్లకు భిన్నంగా చూపించినా… ఇంకోటేదో చెప్పినా… జనం పల్స్ పట్టుకున్న ఆర్పీ నెగిటివిటీ అస్త్రంతో సక్సెస్ అయ్యారు. అదే పంథాలో వెళ్తూ… పొలిటికల్ ప్రమోషన్ ఇప్పుడు మాబాగా సాగుతోందట… టీఆర్ఎస్ మళ్లీ గెలవదు…
జగన్ అధికారంలోకి రాడంటూ ఇన్ డైరెక్ట్ గా డిబేట్స్ లో మోత మోగించిన ఆ సదరు వ్యక్తి… ఇప్పుడు అక్కడ కీలక బాధ్యలు నడిపిస్తుంటే వైసీపీ, టీఆర్ఎస్ అధినాయకత్వాలు చోద్యం చూస్తున్నాయట. ఇవాళ అంతా సాఫీగా సాగిపోతుంది కాబట్టి అందరూ లైట్… ఈ ప్రపంచంలో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరి ఎరుక. ఎవరు ఎప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారో తెలియని వ్యవస్థలివి.
అంతిమ ప్రయోజనం ఒకటుంటుంది. అది పచ్చగా పిచ్చిగానే ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా ఎవరిని కించపర్చాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు. సమాజమంటే అన్ని కులాలు, మాతాల కలయిక… కానీ ఒకరే కమ్మగా అన్నీ చేసేస్తే… ఇదే ఇప్పుడు అక్కడ సింగమ్, రకా రూపంలో సాగుతోంది. అందినకాడికి దండుకనే బ్యాచ్ ఇప్పుడు అక్కడ పెత్తనం చేస్తూ కోట్లు వెనకేసుకుంటుందట. ఇదంతా మిగతా టీం మౌనం దాల్చిచూస్తోంది. కమ్మగా వాసన రావడం ఓ ఎత్తయితే… పచ్చగా ఉండాలన్న వ్యూహం కూడా తెరవెనుక కన్పిస్తోందట.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!