మోడీని అంతా సౌమ్యుడిగా అభివర్ణిస్తారు కానీ రాజకీయాల గురించి బాగా తెలిసిన వారికి మాత్రమే అతను ఎంత గడుసు గా వ్యవహరిస్తాడు మరియు తన అనుకున్నదాని కోసం ఎలా పట్టు పడతాడు అని కొందరికే తెలుసు అని రాజకీయవేత్తల మాట. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై మోడీ వ్యవహరించే తీరు ఉత్తరాది వారితో పోలిస్తే వేరుగా ఉంటుంది అన్నది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణలు. అటువంటి సమయంలో మోడీతో ఎలాంటి ఒప్పందం అయినా స్వేచ్ఛగా చేసేందుకు దక్షిణాది ముఖ్యమంత్రులకు అవకాశం లేదు అన్నది దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఉండే చర్చ.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంగతికి వస్తే ప్రత్యేక హోదా గురించి అధికారంలోకి రాకముందు విపరీతంగా గగ్గోలు పెట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ఇక 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాం అన్న జగన్ తమకు 22 ఎంపీలు మాత్రమే వచ్చారనో ఏమో అసలు దాని ఊసే ఎత్తడం లేదు. ఇక ఎంపీలు అయితే దాని మాట ఎవరైనా ఎత్తితే ఇంకెక్కడి హోదా అన్నట్టు పెదవి విరుస్తున్నారు.
సరే ఈ సంగతి కాసేపు పక్కన పెడితే వేల కోట్లు పోసి వేల మంది రైతుల నుండి భూములు తీసుకొని గత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న రాజధానిని ఈ ప్రభుత్వం వచ్చి మరియు ఒక్కసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు ప్రపోజ్ చేయడం అనేది కూడా చిన్న విషయం కాదు. మరి దీనికి కేంద్రం సపోర్ట్ లేకుండా జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అన్నది అక్షర సత్యం.
అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం కోసం ధన నష్టాన్ని, ప్రజల వ్యథల్ని పట్టించుకోకుండా ముందుకు వేళుతోందంటే వెనుక పెద్ద శక్తుల అండ తప్పకుండా ఉండి తీరాలి. మోడీ అమరావతి విషయంలో ముందు కొంచెం పట్టుబట్టి ఉన్నాడు. అదీ కాకుండా ఏపీ బీజేపీ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీ మరియు జగన్ ఒక డీల్ కు వచ్చినట్లు సమాచారం.
రాజ్యసభలో జగన్ పవర్ బాగా పెరిగింది. అదీ కాకుండా అతని మంత్రులు కేంద్రంలో మంచి మెజారిటీతో ఉన్నారు. మోడీ పరిస్థితి చూస్తే దేశంలో అటుఇటుగా ఊగిసలాడుతుంది. ఇలాంటి సమయంలో జగన్ తో పెట్టుకుంటే అతనికి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి జగన్ కూడా తన మూడు రాజధానుల కలను నెరవేర్చుకునేందుకు ప్రత్యేక హోదా త్యాగం చేశారని సమాచారం. ఇక మోడీ మాత్రం కచ్చితంగా 3 రాజధానుల విషయానికి సహకరిస్తేనే ప్రత్యేక హోదా విషయం ఏపీ లో ఎవరూ ఎత్తరని సమాచారం అందించాడట. మరి మోడీ తో ఇటువంటి క్లిష్టమైన డీల్ చేసుకోవడం మామూలు విషయం కాదు కదా…!