పాలన విషయంలో దేశంలో ముఖ్యమంత్రుల మధ్య మరియు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి కి పోలికలు తరచుగా జరుగుతూ ఉంటాయి. విశ్లేషకులు పాలకుల యొక్క పర్ఫామెన్స్ ని ఏ ఏడాదికి ఆ ఏడాది విశ్లేషిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో కేంద్రం తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చాలా విషయాల్లో ముందు ఉన్నాడనే చెప్పాలి. ఒక వైపు కరోనా విపత్తు మరొక వైపు లోటు బడ్జెట్.. ఇంకా చంద్రబాబు చేసి వెళ్లిన అప్పులు వీటన్నింటిని సహిస్తూ తాను ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు విషయంలో జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడం నిజంగా ప్రశంసనీయం. కరోనా సంక్షోభంతో సంబంధం లేకుండా ఇంత కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ నిన్నటి నుండి వాహన మిత్ర పథకం కింద రాష్ట్రంలోని డ్రైవర్ల అందరికీ ఖాతాల్లోకి పదివేల రూపాయలు చొప్పున జమ చేయడం నిజంగా అనితరసాధ్యమైన విషయం అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన పథకాలను మోడీ సర్కార్ అమలు చేయకూడదని నిర్ణయించుకోగా కరోనా నేపథ్యంలో ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ మరియు గరీబ్ కళ్యాణ్ యోజన పథకాలు ఆగిపోయాయి. ఇప్పటికే 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం కొత్త పథకాలకు నిధుల కోసం ఎలాంటి అభ్యర్థనలు పంపకూడదు అని పేర్కొంది. సరే ప్యాకేజీ లో ఒక్క రూపాయి అయినా ప్రజల వద్దకు చేరిందా అంటే అనుమానమే. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో బడ్జెట్ లో ప్రకటించిన పథకాలన్నింటినీ నిలిపి వేసిన కేంద్రం ఉన్న నిధులను కూడా పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం నిధులు ఉన్నా లేకపోయినా తమ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల నుండి పూర్తి జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది. పక్క రాష్ట్రాల తో సంబంధం లేకుండా ఎవరూ కష్టాలు అనుభవించకుండా సంక్షేమ పథకాలను సరైన సమయానికి అమలు చేస్తూ ప్రభుత్వ అధికారులకు పూర్తి జీతాలు ఇస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే ఆమోదించిన మరియు అనుమతించిన పథకాలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేసిన కేంద్రం గత పదకొండేళ్ల లో ఎప్పుడూ లేనంతగా జీడీపీ వృద్ధిరేటు పడిపోవడంతో ఒక్కసారిగా వణికిపోయింది.
రూ.500 కోట్లలోపు ఇప్పటికే ఆమోదం పొందిన పథకాలూ నిలిచిపోనున్నాయి. జనవరిలో ఆమోదం పొంది, ఇప్పటికే కొనసా గుతున్న పథకాలు మాత్రం కొనసాగుతాయి. ఇదే రకమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రాలది కూడా. మరి అలాంటప్పుడు ఏపీ సీఎం నవరత్నాల పేరుతో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని సంక్షేమ పథకాలకు ఏ మాత్రం కోత విధించకపోగా, వాటి అమలుకు సంబంధించి అది కూడా కరోనా విపత్తు సమయంలో సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి, ఎలా తెస్తున్నాడో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!