KCR: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత కొన్ని సంవత్సరాలుగా మాటలు చెప్పి..జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలంగాణ ప్రజలకు కూడా ఒక రకమైన నమ్మకం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక రకంగా దారుణంగా ఫెయిల్ అయ్యారు. కేసిఆర్ కు జాతీయ స్థాయిలో పరువు తక్కువ అయ్యింది అని చెప్పవచ్చు. రీసెంట్ గా కేంద్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అంటూ బీజేపీ వైఖరిని నిరసిస్తూ 13 రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్దవ్ ఠాకరే, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్టీ, స్టాలిన్ తదితర జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అధినేతలు లేఖను విడుదల చేశారు. ఈ 13 పార్టీల నేతలు బీజేపీకి బద్ద వ్యతిరేకులు. కాంగ్రెస్ పార్టీతో ఉంటారా..? లేదా..? అనేది పక్కన బెడితే బీజేపీకి వ్యతిరేకులు. కేసిఆర్ కూడా ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీకి వెళ్లారు. ధర్నా చేశారు. మీడియా సమావేశం పెడితే చాలు మోడీ, అమిత్ షా, బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు. గత మూడు నాలుగు నెలల నుండి కేసిఆర్..బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకుని ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. బీజేపీ మీద వ్యతిరేకంగా ధర్నాలు చేయడానికి ఢిల్లీ వెళుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
KCR: కేసిఆర్ బీజేపీకి రహస్య మిత్రుడు..?
అయితే కేసిఆర్ వైఖరిని తెలంగాణ ప్రజలు నమ్మారో లేదో తెలియదు కానీ..జాతీయ స్థాయిలో పార్టీ నేతలకు మాత్రం స్పష్టంగా అర్ధం అవుతోంది. ఎందుకంటే.. ఈ 13 పార్టీల్లో ఆయనను కలుపుకోలేదు. దానితో పాటు ఈ 13 పార్టీలు ప్రణాళికలు చర్చించుకోవడానికి కేసిఆర్ ను కనీసం ఆహ్వానించడం లేదు. బీజేపికి వ్యతిరేకంగా కేంద్రం స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కూడా కేసిఆర్ ను ఆహ్వానించడం లేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఎందుకు అంటే..? కేసిఆర్ మీద నమ్మకం లేక. ఇదే కేసిఆర్ గతంలో స్థాలిన్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. కలిసినప్పుడల్లా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కావాలి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఒక్క శాతం కూడా కేసిఆర్ సక్సెస్ కాలేదు. ఢిల్లీ లో వీళ్లందరితో కలిసి ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు కేసిఆర్. కానీ తెలంగాణలో మీటింగ్ పెట్టిన ప్రతి సారి ఫెడరల్ ఫ్రంట్ అని అంటుంటారు. ఈ 13 పార్టీలు చేసిన పనితో కేసిఆర్ బీజేపీతో రహస్య మిత్రుడు అన్న క్లారిటీ వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పీకే కేసిఆర్ కు క్లైయింట్ అయినప్పటికీ..
పైగా కేసిఆర్ బీజేపీకి శత్రువు కాదు. రహస్య మిత్రుడే, కేంద్రంలోని బీజేపీకి ఆపత్కాలంలో రాజ్యసభ సభ్యులను కేసిఆర్ అందిస్తారు అన్న అనుమానంతో ఆ 13 పార్టీల నేతలు ఆయనను నమ్మకూడదు అని ఒక క్లారిటీకి వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఈ 13 పార్టీలకు ప్రణాళికలు వేస్తుంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)యే. పీకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త, ఆ పార్టీలో ఒక మెంబర్. పైగా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ లకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్. వీళ్లకు క్లైయింట్. అదే ప్రశాంత్ కిషోర్ కేసిఆర్ కు కూడా క్లైయింట్ యే కదా. మరి ఆ 13 పార్టీలతో కేసిఆర్ ను కలిపేందుకు పీకే ట్రై చేయలేదు అన్నది అలోచిస్తే.. ప్రధానంగా సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు నమ్మకపోవడమేననేది స్పష్టం అవుతోంది. ఇక ఏపి సీఎం వైఎస్ జగన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అంతర్గత స్నేహం కొనసాగిస్తున్న సంగతి దేశ వ్యాప్తంగా తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews