NewsOrbit
5th ఎస్టేట్

రుణాల రద్దులు దేనికి సంకేతం…?

వారివి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు..! రూ. వేలకోట్ల ఆస్తి పరులు. కానీ బ్యాంకులకు వేల కోట్లు బకాయి పడ్డారు. ఈ బకాయిలను ఆర్బీఐ రద్దు చేసింది. దేశంలోని 50 మందికి చెందిన మొండి బకాయిలు రూ. 68 607 కోట్లను రద్దు చేసినట్టు ఆర్బీఐ తాజాగా ఒక సమాచారహక్కు చట్టం దారకాస్తుకి సమాధానంగా పేర్కొంది. ఈ రద్దులు ఏ పేదోడివో కాదు. దేశంలో వేల కోట్ల సంపద కలిగి, బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని, ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయినా బడా వ్యారాపవేత్తలైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, జోస్కీ లాంటి వారు కూడా ఉన్నారు. 2014 నుండి ఇలా దాదాపు రూ. ఆరు లక్షల కోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఇది దేనికి సంకేతం. ఓ వైపు కరోనాతో దెస ఆర్ధిక వ్యవస్థ అల్లాడుతుంటే ఇలా రద్దులు చేయడం, పెద్దల నుండి రాబెట్టుకోకుండా రద్దులు చేయడం మన వ్యవస్థ ఎటు ఉందన్న అనుమానాలు వ్యక్తం కాక మానదు.

రద్దు… మాఫీ.. ఇదే వివరణ…!

బ్యాంకుల్లో రుణాలను మాఫీ చేయలేదు. కేవలం రద్దు మాత్రమే చేసాం అనేది ఆర్ధిక మంత్రి నిర్మల వివరణ ఇచ్చుకుంటున్నారు. అంటే ఆ డబ్బుని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించలేదు. బ్యాంకులే క్రమేణా తమ లాభాల నుండి కొంత వాటాని మొండి బాకీల లెక్క కింద ఉంచుతాయి. ఆ క్రమంలో ఇలా రద్దు చేస్తుంటారు. అని పేర్కొంటున్నారు. అంటే బ్యాంకుల బాలన్స్ షీట్లలు వీటిని చూపించరు. అంటే వీళ్ళు తమ బ్యాంకులకు అప్పులు ఉన్నారని అనేది బ్యాంకుల లెక్కల్లో కనిపించదు. దీని వలన బ్యాంకులకు ఒరిగేది ఏమి లేదు. నిజానికి బ్యాంకుల వ్యవస్థలో ఇవి సహజమే అనుకుంటూ చెప్పుకుంటున్నారు కానీ, కావాలని.., ఉద్దేశ పూర్వకంగానే అప్పులను ఎగ్గొట్టిన పెద్దల నుండి వసూలు చేసే, ప్రయత్నాలను ముమ్మరం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఈ పెద్దలందరూ దురుద్దేశమే…!

ఇప్పుడు, గతంలో రద్దు చేసిన రుణ గ్రహీతలు అందరూ దురుద్దేశం పూర్వక గ్రహీతలే. అంటే సాధారణంగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటే మనకున్న ఆస్తులను బ్యాంకులను వేలం వేసుకుని జమ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఈ పెద్దల ఆస్తులను వేలం వేయడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. తిరిగి కట్టడం లేదు, ఇలా గడిచిన ఆరేళ్లలో రూ. ఆరు లక్షల కోట్లని రద్దు చేసారు.
* ఇక్కడే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే… పేదలపైభారాలు వేస్తున్నారు. చివరికి కరోనా సాయంగా కూడా రూ. లక్ష డెబ్బై వేల కోట్లు ఇచ్చారు. దీనికి నాలుగు రెట్లు అనవసరంగా రద్దు చేశారు. ఇదే తరహాలో రూ. ఆరు లక్షల కోట్లతో పేదలకు ప్యాకేజిగా ఇస్తే దేశంలో 35 శాతం పేదలకు చాల ఉపశమనం కలిగేది.

రైతులకు, పేదలకు నోటీసులు…!

మరోవైపు దేశంలో రైతులు సేద్యం కోసం, కొందరు మధ్యతరగతి వాళ్ళు వ్యాపార, పరిశ్రమల కోసం తీసుకున్న రుణాలను బ్యాంకులు మొండిగా వసూలు చేస్తుంటాయి. పదే పదే నోటీసులు ఇస్తుంటారు. ఇలా దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో రూ. 18 లక్షల కోట్లు వరకు రైతులు బకాయి పడ్డారు. దీన్ని క్రమేణా, రైతుల పరిస్థితుల వారీగా రద్దు చేస్తే కనీసం ఏడాదికి కోటి కుటుంబాలకు ఉపశమనం కలిగించే వీలుంది. కానీ దేశంలో క్లిష్టమైన ఆర్ధిక వ్యవస్థలో కూడా దురుద్దేశరుణ గ్రహీతలకు మాత్రం రుణాలు రద్దయ్యాయి.

author avatar
Srinivas Manem

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment