వారివి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు..! రూ. వేలకోట్ల ఆస్తి పరులు. కానీ బ్యాంకులకు వేల కోట్లు బకాయి పడ్డారు. ఈ బకాయిలను ఆర్బీఐ రద్దు చేసింది. దేశంలోని 50 మందికి చెందిన మొండి బకాయిలు రూ. 68 607 కోట్లను రద్దు చేసినట్టు ఆర్బీఐ తాజాగా ఒక సమాచారహక్కు చట్టం దారకాస్తుకి సమాధానంగా పేర్కొంది. ఈ రద్దులు ఏ పేదోడివో కాదు. దేశంలో వేల కోట్ల సంపద కలిగి, బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని, ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయినా బడా వ్యారాపవేత్తలైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, జోస్కీ లాంటి వారు కూడా ఉన్నారు. 2014 నుండి ఇలా దాదాపు రూ. ఆరు లక్షల కోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఇది దేనికి సంకేతం. ఓ వైపు కరోనాతో దెస ఆర్ధిక వ్యవస్థ అల్లాడుతుంటే ఇలా రద్దులు చేయడం, పెద్దల నుండి రాబెట్టుకోకుండా రద్దులు చేయడం మన వ్యవస్థ ఎటు ఉందన్న అనుమానాలు వ్యక్తం కాక మానదు.
రద్దు… మాఫీ.. ఇదే వివరణ…!
బ్యాంకుల్లో రుణాలను మాఫీ చేయలేదు. కేవలం రద్దు మాత్రమే చేసాం అనేది ఆర్ధిక మంత్రి నిర్మల వివరణ ఇచ్చుకుంటున్నారు. అంటే ఆ డబ్బుని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించలేదు. బ్యాంకులే క్రమేణా తమ లాభాల నుండి కొంత వాటాని మొండి బాకీల లెక్క కింద ఉంచుతాయి. ఆ క్రమంలో ఇలా రద్దు చేస్తుంటారు. అని పేర్కొంటున్నారు. అంటే బ్యాంకుల బాలన్స్ షీట్లలు వీటిని చూపించరు. అంటే వీళ్ళు తమ బ్యాంకులకు అప్పులు ఉన్నారని అనేది బ్యాంకుల లెక్కల్లో కనిపించదు. దీని వలన బ్యాంకులకు ఒరిగేది ఏమి లేదు. నిజానికి బ్యాంకుల వ్యవస్థలో ఇవి సహజమే అనుకుంటూ చెప్పుకుంటున్నారు కానీ, కావాలని.., ఉద్దేశ పూర్వకంగానే అప్పులను ఎగ్గొట్టిన పెద్దల నుండి వసూలు చేసే, ప్రయత్నాలను ముమ్మరం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఈ పెద్దలందరూ దురుద్దేశమే…!
ఇప్పుడు, గతంలో రద్దు చేసిన రుణ గ్రహీతలు అందరూ దురుద్దేశం పూర్వక గ్రహీతలే. అంటే సాధారణంగా బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటే మనకున్న ఆస్తులను బ్యాంకులను వేలం వేసుకుని జమ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఈ పెద్దల ఆస్తులను వేలం వేయడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. తిరిగి కట్టడం లేదు, ఇలా గడిచిన ఆరేళ్లలో రూ. ఆరు లక్షల కోట్లని రద్దు చేసారు.
* ఇక్కడే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే… పేదలపైభారాలు వేస్తున్నారు. చివరికి కరోనా సాయంగా కూడా రూ. లక్ష డెబ్బై వేల కోట్లు ఇచ్చారు. దీనికి నాలుగు రెట్లు అనవసరంగా రద్దు చేశారు. ఇదే తరహాలో రూ. ఆరు లక్షల కోట్లతో పేదలకు ప్యాకేజిగా ఇస్తే దేశంలో 35 శాతం పేదలకు చాల ఉపశమనం కలిగేది.
రైతులకు, పేదలకు నోటీసులు…!
మరోవైపు దేశంలో రైతులు సేద్యం కోసం, కొందరు మధ్యతరగతి వాళ్ళు వ్యాపార, పరిశ్రమల కోసం తీసుకున్న రుణాలను బ్యాంకులు మొండిగా వసూలు చేస్తుంటాయి. పదే పదే నోటీసులు ఇస్తుంటారు. ఇలా దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో రూ. 18 లక్షల కోట్లు వరకు రైతులు బకాయి పడ్డారు. దీన్ని క్రమేణా, రైతుల పరిస్థితుల వారీగా రద్దు చేస్తే కనీసం ఏడాదికి కోటి కుటుంబాలకు ఉపశమనం కలిగించే వీలుంది. కానీ దేశంలో క్లిష్టమైన ఆర్ధిక వ్యవస్థలో కూడా దురుద్దేశరుణ గ్రహీతలకు మాత్రం రుణాలు రద్దయ్యాయి.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!