ఓ పెద్ద మీడియా సంస్థ..! ఆ అధినేత కరోనా పట్ల సాయంగా రూ. 20 కోట్లు కూడా అందించారు. తమ సంస్థల్లో అనేక నీతులు రాస్తుంటారు. కరోనా పట్ల అత్యంత అప్రమత్తత రాస్తుంటారు. ఆ నీతులకు, రాతలకు పాఠకులు “అబ్బో”..! “అబ్బా”..! అనుకుంటారు. కానీ ఈ సంస్థలో ఉద్యోగులకు కరోనా వస్తే దిక్కు లేదు. కనీసం వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడం లేదు. కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. అదేమిటో చూద్దాం పదండి.
* ఒక కీలక విభాగంలో పనిచేసే లేడీ బాస్ కి జ్వరం వచ్చింది. అయినా పట్టుదల, నిబద్ధతతో ఆఫీస్ కి వచ్చేసింది. రెండు రోజుల తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఆమె కారణంగా ఆ విభాగంలో నలుగురికి కరోనా సోకింది. ఇది జరిగి 40 రోజులు గడిచింది.
* ఒక భవనంలోని ఒకే ఫ్లోర్ లో 16 మందికి కరోనా సోకింది. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలా, అలా 16 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. పాజిటివ్ అయితే, సెలవులు తీసుకుంటే వేతనం కట్ చేస్తున్నారు అనే భయంతో ఎవ్వరూ బయటకు చెప్పడం లేదు.., జ్వరం, జలుబు వంటి లక్షణాలున్నా ఆగడం లేదు. దీంతో వరుసగా వ్యాప్తి పెరుగుతుంది. ముదిరిన తర్వాత తెలుస్తుంది.
* అదే భవనంలోని మరో ఫ్లోర్ లో 12 మందికి కరోనా సోకింది. ఇక్కడా అదే పరిస్థితి. బిజినెస్ డెస్క్ చూసే ఓ కీలక ఉద్యోగికి మూడు రోజుల కిందట పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఆయన సెలవులో ఉండడంతో మరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా భయంతో సొంత ఊరు వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం అన్నా అంగీకరించడం లేదు. ఇలా ఈ డెస్క్ మొత్తం గందరగోళంలో ఉంది. ప్రత్యేక పేజీలు చూసే ఓ కీలక ఉద్యోగి సెలవు పెట్టేసి వెళ్ళిపోయి నెల దాటింది. అదే భవనంలో ఉండే రెండు కీలక డెస్కుల ఇంచార్జిలకు కరోనా సోకి.., ఆసుపత్రిలో చికిత్స పొందారు. (ఆ భవనమే ఈనాడు మెయిన్ డెస్క్. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. నాలుగు ఫ్లోర్లు.., సుమారుగా 250 మంది పని చేస్తారు.) అంతా జరిగిన తర్వాత వరుసగా కేసులు పెరుగుతుండడంతో ఇక శానిటైజేర్ టన్నెల్ ఏర్పాటు చేసారు.
కోవిడ్ కనీస జాగ్రత్తలు ఏవి…?
కరోనా అంటే సామజిక దూరం ఉండాలి. మాస్కులు ఉండాలి. ఒకే ఈ రెండూ ఈ సంస్థలో ఉద్యోగులు పాటిస్తున్నారు. కానీ ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తున్నా నియంత్రణ ఎక్కడ..? జాగ్రత్తలు ఎక్కడ పాటిస్తున్నారు..? వాడే కుళాయిలు, కూర్చునే కుర్చీలు, నిత్యం తిరిగే చోటు అదే ఉన్నప్పుడు ఎందుకు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు…?? డెస్కుల్లో పని చేయాలంటే ఫోటో కంపోజింగ్ పక్కనే సబ్ ఎడిటర్ ఉండాలి. ఇలా కొన్ని ఇబ్బందులు తప్పవు.
* ఒక భవనంలో, ఒక ప్రాంతంలో అయిదుగురు అంత కంటే ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ వస్తే రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ అంటున్నారు. మరి ఈనాడులో అవేమి ఎందుకు వర్తించడం లేదు..? రాజుకి ఒక రూలు, పేదకి ఒక రూలు ఎందుకు..?? కరోనా పరీక్షల సమయంలో ఉద్యోగులు తమ ఇళ్ల చిరునామాలు ఇస్తున్నారు. దీంతో వైద్య శాఖకి ఈనాడులో ఇన్ని కేసులు ఉన్నట్టు తెలియడం లేదు. అందుకే ఒకే భవనంలో వరుసగా కేసులు వ్యాప్తి పెరుగుతుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇవ్వడం లేదు..??
కరోనా కారణంగా చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ఈనాడులో పని చాలా వరకు ఇంటి నుండి చేసేదే. వార్తలు ఎడిట్ చేయడం, పేజీ మేకప్ చేయడం ఇంటి నుండి చేసుకునే వీలుంటుంది. అందుకే కొందరు ఉద్యోగులు కూడా అదే అడుగుతున్నారు. ఇంటి నుండి పని చేసుకుంటాం అంటూ ప్రతిపాదనలు చెప్తున్నప్పటికీ… మెయిన్ డెస్క్ కావడంతో కొన్ని జాగ్రత్తలు చెప్తూ.., “వస్తుంది, వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి” అని చెప్తూ సర్దుకుంటున్నారు. ఇదే ఈనాడులో కరోనా సంగతి.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!