ఉత్తరాంధ్ర అంటే మరీ కొన్ని మీడియాలకు ఎకసెకాలుగా ఉందేమో…! సిక్కోలు, ఇజీనగరం, ఇసాపట్నం అంటే బాగా లోకువైనట్టున్నాయి. ఇక్కడ ప్రతికూలత తప్ప అనుకూలత కనిపించట్లేదేమో..!
అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది…!
అంతర్జాతీయ నౌకాశ్రయం ఉంది..!
నగరం మొత్తం మధ్యలో వెళ్తూ జాతీయ రహదారి ఉంది…!
నగరానికి ఓ వైపు సముద్ర తీరం.., మరోవైపున సుందర కొండలున్నాయి..!!
విశాఖపట్నంలో లేనిదంటూ ప్రస్తుతం ఏమి లేదు. సచివాలయం, సీఎం నివాసయోగ్య భవనం, పోలీసు భవనాలు కట్టేస్తే చాలు. రాజధానిగా పరిపూర్ణత వచ్చినట్టే. కానీ కొన్ని మీడియాలకు, కొన్ని పార్టీలకు విశాఖపట్నం రాజధానిగా ఉండకూడదు. సరే వారి ఆలోచనలకు తగ్గట్టే ఇప్పుడు విపరీతంగా ప్రమాదాలు జరిగిపోతున్నాయి.., విశాఖపట్నం రాజధాని అయితే ఇంకా ప్రమాదాలు పెరిగిపోతాయా..? అవ్వకపోతే తగ్గిపోతాయా…? సీఎం గా చంద్రబాబు ఉన్నప్పుడూ అనేక ప్రమాదాలు జరిగాయిగా…? ఒక్కసారి అందరికీ గుర్తుండే కొన్ని పెద్ద ప్రమాదాలను పరిశీలిద్దాం..!
చంద్రబాబు సీఎంగా ఆ ప్రమాదాల్లో 72 మంది మృతి…!
1. 1997లో HPCL రిఫైనరీలో వ్యాపర్ క్లౌడ్ పగిలిపోవడంతో 60 మంది మృతి చెందారు.
2. విశాఖలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటిలో ఏపీఐలు ఉత్పత్తి చేసే ఒక ఫార్మా ఫ్యాక్టరీలో మే, 2016 జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
3. శ్రీకర్ ల్యాబోరేటరీస్లో 2016 జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
4. 2017లో అజికో బయోఫోర్ ఇండియాలో జరిగిన ప్రమాదంలో 5గురు మృత్యువాత పడ్డారు.
5. 2019లో యాక్టివ్ జనరిక్స్, విజయశ్రీ ఆర్గానిక్స్ సంస్థల్లో జరిగిన ప్రమాదాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
6. 2019లోనే స్మైలెక్స్ ల్యాబోరేటరీస్ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
హెచ్పీసీఎల్ లో జరిగిన ప్రమాదం తప్పితే… 2014 నుంచి 2019 వరకు జరిగిన ప్రమాదాలకు సబంధించిన వార్తలను. టీడీపీ అనుకూల మీడియా అనగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా… మొదటి పేజీలో ప్రచురించలేదు. TV 5, ABN ఛానళ్లు ఎప్పుడూ చర్చలు పెట్టి రచ్చ చేయలేదు. కానీ
ఇప్పుడు.. విశాఖపట్నం రాజధాని అవుతోంది.. అమరావతి ఆగిపోతుంది అనే ఆలోచనతో సాధారణ ప్రమాదలను కూడా పెద్దవిగా చూపిస్తూ.. బాబు సామాజికవర్గానికి చెందిన పత్రికలు, ఛానెళ్లు ( ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN) తాటికాయంత అక్షరాలతో మొదటి పేజీలో అచ్చేస్తున్నాయి. విశాఖపై విషం చిమ్ముతున్నాయి. టీవీల్లో గంటల తరబడి చర్చలు పెడుతున్నారు.
ఇక తెలుసుకోవాల్సింది ఏమిటంటే…!
పరిశ్రమలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఏ జిల్లాలో అయినా జరుగుతాయి. రేపు అమరావతిలో కూడా పరిశ్రమలు వస్తే ఇలాగే రెట్టింపు జరగవచ్చు. విశాఖ రాజధాని కాకపోతే ప్రమాదాలు ఆగిపోవు.., విశాఖ రాజధాని అయితే ప్రమాదాలు పెరిగిపోవు. నాచు సీఎం గా చంద్రబాబు ఉన్నప్పుడు ఈ ప్రమాదాలు తగ్గలేదు. నేడు సీఎం గా జగన్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఏమి తగ్గలేదు. అప్పుడు తగ్గింది, ఇప్పుడు పెరిగింది మీడియాలో కవరేజీ మాత్రమే. సామజిక వర్గానికి, ఒక పార్టీకి అడుగులు ఒత్తుకుంటూ వెళ్తే ఇలాగే కనిపిస్తాయి.
ఈ మీడియా కళ్ళకు కనిపించని వాస్తవాలు, విశాఖ.., అమరావతిలో ఈ మీడియా లావాదేవీలు మళ్ళీ చెప్పుకుందాం..!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!