దేశంలో ఇప్పుడు మార్మోగుతున్న పేరు సోనూ సూద్. పేదోళ్లకు దేవుడిగా.., పెద్దోళ్ళకు ఆదర్శప్రాయుడిగా.., పిల్లలకు హీరోగా… సినిమా వాళ్లకు మార్గదర్శిగా… సోనూ నిలిచిపోయారు. కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సాయం ఏ వ్యక్తి, తన జీవిత కాలంలో చేయలేనిది. 40 వేల మందికి భోజనాలు పెట్టడం, తన హోటల్ ని వైద్య అవసరాలకు ఇచ్చేయడం.., వలస కార్మికులు వెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేయడం.., ఏకంగా ఫ్లయిట్ బుక్ చేసి వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపించడంతో ఆయన దేశంలో హీరోగా మారిపోయారు. ఇప్పుడు ఆయనపై రాజకీయుల కళ్ళు పడ్డాయి.
కాంగ్రేస్ కొత్త విమర్శ…!
సోను సూద్ పై ఇప్పుడు కాంగ్రెస్ కళ్ళు పడ్డాయి. మహారాష్ట్రలో వలస కార్మికులను ఆదుకునే క్రమంలో బస్సుల అనుమతి కోసం సూద్ అక్కడి గవర్నర్ ని కలిశారు. దీని పాయింట్ చేస్తూ కాంగ్రెస్ అతన్ని టార్గెట్ చేస్తుంది. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కేంగ్రెస్, శివ సేన ప్రభుత్వాన్ని చెడు చేసేందుకే ఆయన గవర్నర్ ని కలిసారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు. ప్రచారం కోసం వీళ్ళు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారంటూ 2019 లో కోబ్రా పోస్ట్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ని సంఘమిత్ర అనే నాయకురాలు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. సోను కి బీజేపీ అన్ని అనుమతులు ఎలా ఇచ్చేస్తుంది అని? స్థానిక ప్రభుత్వాల అనుమతులు అవసరం లేదా అంటూ ఆమె పోస్టు చేసారు. మరో కాంగ్రెస్ వాది “నాడు అన్న హజారే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే.. నేడు సోను బీజేపీ ని దగ్గర చేసే క్రమంలో ఇన్ని సేవలు చేస్తున్నారని… ఇది బీజేపీ డ్రామా అంటూ పోస్టులు పెట్టారు. ఇలా రకరకాల నాయకులూ ఇలా సూద్ సాయాన్ని విమర్శిస్తున్నారు.
సూద్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు…!
నాయకుల రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే దేశం నలువైపులా నుండి సోను కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటీవల ఆయన ఏర్పాటు చేసిన విమానం లో ఒడిస్సా చేరుకున్న మహిళా తనకు పుట్టిన బిడ్డకి సోను సూద్ శ్రీ వాత్సవ అని పేరు పెట్టుకుంది. ముంబై లో వలాస కార్మికుడిగా జీవితాన్ని ఆరంభించిన సోనూ నాడు బస్సుల్లో పాస్ తీసుకుని తిరిగిన ఒక పాస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ప్రజలతో పాటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సోను సాయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభినందిస్తున్నారు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ మాజీ అమరిందర్ సింగ్.., ఇతర ముఖ్యులు సైతం సోనూ సూద్ ని ముంచెత్తుతున్నారు. ఇదే సమయంలో సోనూ గనక రాజకీయాల్లోకి వస్తే దేశంలో అత్యధిక ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉంది అంటూ ఆయన పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారు.