ఆర్బీఐ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత దేశ ప్రజలకు ఒక మాంచి చలనచిత్రం చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో 68,607 కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తల రుణాలను రైట్ ఆఫ్ చేసింది. ఇవి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన టాప్-50 కి చెందిన జాబితా వారి మొత్తం మాత్రమే కావడం గమనార్హం. ఇది కూడా ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన సమాచారం.
అయితే రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు, బ్యాంకర్లు చెబుతున్న కూడా సాంకేతికంగా రుణమాఫీ అన్నా.. పద్దుల మార్పిడి అన్నా… ఇక వారి దగ్గర నుండి బకాయిలను రాబట్టలేమని చెప్పి చేతులెత్తేయడం. ఎగవేతదారుల హామీగా పెట్టినా ఆస్తులన్నింటినీ వేలం వేశాక.. వీలైనన్ని మార్గాల్లో డబ్బులు వసూలు చేయగా ఇంకా బకాయిలు మిగిలితే చేసేది ఏమీ లేక వాటిని రైటాఫ్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇలా రైట్ ఆఫ్ పొందినవారిలో అత్యధికులు సమాజంలో ధనికులుగా చలామణి అవుతూ కోట్ల రూపాయల విలువ చేసే కార్లలో తిరిగే కుబేరులే.
ఇక సామాన్యుల విషయానికి వద్దాం. లాక్ డౌన్ విధించింది ప్రభుత్వమే. అసలు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా కారణం కూడా ప్రభుత్వమే. ఎలాంటిది ఇటువంటి క్లిష్ట సమయంలో మూడు నెలలు ఈఎంఐ కట్టలేము మొర్రో అని అంటే అది వాయిదా వేసుకునే ఛాన్స్ ఇచ్చిన ఆర్బీఐ ఏదో పెద్ద మేలు చేసినట్లు పోజ్ కొట్టి చివరికి ఆ వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ కలిపేసి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సామాన్యులకు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టేంత సీన్ లేదు కదా. అదే బడా పారిశ్రామికవేత్తలు అయితే వీటిని మొండి బకాయిలుగా చేస్తారు. వాళ్లకు ఏమో ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం.
ఇలా వాళ్లు వేలాది కోట్లు ఎగ్గొట్టి తిరుగుతుంటే వారిని ఏమీ చేయలేక సామాన్యుల మీద పడి దోచేస్తుంటారు. చివరికి సామాన్యులను ట్యాక్సులు అడగడానికి మనసు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతకీ అలా రుణాలు మాఫీ చేయించుకున్నవారి లిస్ట్ చూస్తే నీరవ్ మోడీ మామ మోహుల్ చొక్సీ, బాబా రామ్ దేవ్, విజయ్ మాల్యా, మన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు. రేపు లాక్ డౌన్ ముగిశాక తమ రుణాలు కట్టడానికి ఇబ్బంది పడే సామాన్యులు ఎవరు అంటే మన ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్న, వెంకట్రావు 20 సంవత్సరాల నుండి సొంత ఇంటి లోన్ కట్టుకుంటున్న రమేషు… వీరి చివర ఆటో నడుపుకునే సైదులు. ఇదీ మనందరం జీవిస్తున్న ఆధునిక జీవిత చలన చిత్రం.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!