TDP Mahanadu: తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగ లాంటిది. టీడీపీ ఆవిర్భావం నుండి ప్రతి సంవత్సరం మహనాడు నిర్వహిస్తారు. మహానాడులో టీడీపీ విధి విధానాలు ఖరారు అవ్వడంతో పాటు అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. కార్యకర్తలు దీన్ని పండుగగా భావించి స్వచ్చందంగా హాజరు అవుతారు. తీర్మానాలు ఉంటాయి. నాయకుల ప్రసంగాలు, రాబోయే కాలంలో ఎటువంటి ప్రణాళికలపై చెబుతారు. ఈ మహానాడు కోసం రెండు మూడు నెలల ముందు నుండే ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తుంటాయి. మహానాడు ఎవరెవరు వస్తారు..? ఏమేమి మాట్లాడతారు..? రెస్పాన్స్ ఎలా ఉంటుంది..? ఎంత మంది వస్తారు..? అనే దానిపై ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే గత మూడు సంవత్సరాలుగా మహానాడు జరగలేదు. 2019లో పార్టీ ఓటమి, భయం బాధ కారణంగా జరగలేదు. ఆ తరువాత రెండేళ్లు కరోనా ఫస్ట్, సెకండే వేవ్ కారణంగా మహానాడు జరపలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP Mahanadu: టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మహానాడు
ఇప్పుడు 2022 లో తప్పనిసరిగా మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఘోర ఓటమి తరువాత వరుసగా మూడేళ్లు మహానాడు జరపలేదు కాబట్టి ఈ సారి మహానాడు నిర్వహించి పార్టీని యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు మహానాడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రెస్టేజియస్ మారింది. ఆ పార్టీ ఘనంగా మహానాడు నిర్వహించాల్సి ఉంది. అందుకు ఆ పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో దాదాపు 15, 16 కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీలు అన్నీ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 30 నుండి 50 మంది నాయకుల బృందం గత పదిహేను రోజులుగా ఈ పనిలో బిజీగా ఉంది.
TDP Mahanadu: వేదిక ఏర్పాటునకు అడ్డంకులు
దీన్ని ఏ విధంగా డిస్ట్రబ్ చేయాలని వైసీపీ చూస్తుంటే ఏ విధంగా సక్సెస్ చేయాలా అనేది టీడీపీ చూస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్లదే పై చేయి అవుతుంది. రాజకీయ ప్రత్యర్ధుల మీటింగ్ అంత సులువుగా జరుపుకుంటుంటే అధికార వైసీపీ చూస్తూ ఊరుకుండే రకం కాదు. ఒంగోలులో మహానాడు నిర్వహించుకునేందుకు జాతీయ రహదారి పక్క ఓ పెద్ద ఖాళీ మైదానాన్ని చూశారు. రాష్ట్రంలో ఏ మూల నుండైనా రాకపోకలు సాగించేందుకు ఈ వేదిక అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడ ప్రభుత్వం (పోలీసులు) కొన్ని కారణాలు చూపి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒంగోలు సమీపంలో 15 కిలో మీటర్ల గొల్లేపల్లికి జాతీయ రహదారికి కొద్దిగా లోపలకు మహానాడు వేదికను మార్చారు. వేదిక విషయంలోనే అడ్డుతగిలారు.
మహానాడు కు సవాళ్లు
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మహానాడు వేదికకు ఇబ్బందులు పెట్టలేదు. అంతకు ముందు ఏ ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టలేేదు. మొదటి సారి మహానాడు నిర్వహణకు సవాళ్లు, ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఎదురవుతున్నాయి. మహానాడుకు ఇంకా 8 రోజులు ఉంది. మహానాడు సక్సెస్ కాకుండా ఉండాలని వైసీపీ ప్రయత్నిస్తుందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మహానాడు నుండి దృష్టి మళ్లించేందుకే వైసీపీ బస్సు యాత్ర పెట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. మహానాడు జరిగేలోగా ఇంకా ఎన్ని అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు దాటుకుని మహానాడును టీడీపీ సక్సెస్ చేసుకోగలగుతుందా అనేది వేచి చూడాలి.