సరిగా పెళ్లి ముహూర్తానికి జీలకర్ర – బెల్లం పెడుతున్నప్పుడు వాయించండి, వాయించండి అంటూ పంతుళ్లు గోల చేస్తారు. వాళ్ళు వాయిస్తారు..!!
భాజంత్రీలు పెళ్ళికి వాయిస్తేనే అందం. అన్ని సందర్భాలకు అవే వాయిస్తే వెగటు పుడుతుంది. అచ్చం తెలుగు మీడియాలా తయారవుతుంది. సమయం, సందర్భం లేకుండా… తమకు అనుకూలంగా వాయించుకునే అక్షర భాజంత్రీలు ఉన్నంత కాలం “తెలుగు మీడియా పాఠకుడు పిచ్చోడే”..!
తెలుగు పత్రికలకు కనీసం విజ్ఞత, సోయి, పత్రికా జ్ఞానం కరువవుతుంది. అచ్చమైన నుడి భాషలో చెప్పుకోవాలంటే “కామన్ సెన్స్” లోపిస్తుంది. కోర్టు తీర్పు అయినా, పార్లమెంటు బిల్లు అయినా, సందర్భం ఏదయినా తమకు అనుకూల లైన్లు తీసుకుని వార్త అల్లేసి, పత్రికల్లో పరిచేసి పాఠకుడిని పిచ్చోడిని చేసేయడమే. అందుకు తాజాగా నిన్న స్వర్ణ పాలస్ ఘటనపై సుప్రీం ఇచ్చిన తీర్పుని ఈ పత్రికలు రాసిన విధానమే అక్షర సాక్ష్యం. “స్వర్ణ పాలస్ లో దుర్ఘటన జరిగి పది మంది మరణిస్తే విచారణలో రాజకీయ జోక్యం పెరిగింది, కక్ష సాధింపు ఉంది అంటూ రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ కోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ విచారణపై స్టే ఇచ్చింది. ఆపేయమంది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కి వెళ్తే “దర్యాప్తు ఆపాల్సిన అవసరం లేదు. విచారణ జరగాలి” అంటూ సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇది ప్రధాన సారాంశం. ఇదే మెయిన్ వార్త, ఆ పై ఎవరికీ తోచింది వారు గ్రహించి తీసుకోవచ్చు. కానీ దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఎలా రాసాయో ఓ సారి చూద్దాం..!!
ఇది ఈనాడు వార్త. “కస్టడీ విచారణ అక్కర్లేదు అని కోర్టు చెప్పింది, రమేష్ కి ఊరట కలిగింది” అని ప్రధానంగా ప్రచురించింది. ఇది ఎంత దిగజారుడు రాతలంటే..!! విచారణ జరగాలి అని చెప్పిన విషయాన్ని మళ్లించి కష్టడీ అనే అంశాన్ని తగిలించి ఈనాడు తన భక్తి చాటుకుంది. తన సామజిక వర్గం, తన పార్టీ, తన లోగుట్టు భాజంత్రీని ఫుల్ గా వాయించేసింది. పైకి మేము న్యూట్రల్, మేము ప్రజల పక్షం, నిత్యం ఉషోదయంతో సత్యం నినదించే గాక అని చెప్పుకునే ఈనాడులో ఇవీ భజనల రాతల పరిస్థితి.
ఇది జ్యోతిలో వార్త. ఆంధ్రజ్యోతిలో ఇలా రాకపోతేనే ఆశ్చర్యం వచ్చింది కాబట్టి ఏ మాత్రం చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే సుప్రీం కోర్టు తీర్పుని కూడా తమకు కావాల్సినట్టుగా రాసుకోవడంలో.., తమ వారికి న్యాయం చేసేలా అక్షరాలను తిప్పడంలో జ్యోతిని మించిన వారు లేరు. ప్రధాన తీర్పుని పక్కకు నెట్టేసి.., భక్తి, భజనలు చాటుకున్నాయి. చంద్రబాబు చంకన ఎక్కి కూర్చోవాలంటే ఇటువంటి రాతలు తప్పవుగా మరి.
ఇది మరీ దారుణం. సాక్షిలో రాతలు. సుమారు 70 , 80 కేసుల తర్వాత ప్రభుత్వానికి తొలిసారిగా సుప్రీంలో అనుకూల తీర్పు వస్తే దాన్ని అనుకూలంగా మలచుకోవడమూ తెలియలేదు. రమేష్ ఆసుపత్రికి వ్యతిరేకంగా, హైకోర్టు తీర్పుకి వ్యతికరేకంగా కుమ్మేయాల్సిన చోట సాదాసీదా వార్తని రాసుకుంది. ఇదే అవకాశం ఈనాడు లాంటి పత్రికకు అందితే… ఒక వేళ నిన్న తీర్పులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఎలా రాసుకునేవో.., ఏం హెడ్డింగులు పెట్టుకునేవో సాక్షి ఊహకు కూడా రాదూ. సాక్షిలో జర్నలిస్టులు పడుకుని.., భజనపరులు మెలుకువగా ఉన్నారు. అందుకే ఈ రాతలు, చేతగాని డప్పులు..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!