కొన్ని నెలల కిందట TRP Ratings Scam Mumbai టీఆర్పీ కుంభకోణం కేసులో రిపబ్లిక్ టీవీ Republic TV జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి Arnab Goswami అరెస్ట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొద్దీ రోజులు జైల్లో గడిపిన ఆయన.. తర్వాత విడుదలై.. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ చానెళ్లు పెడతానని చెప్పారు. ఆయన చానెళ్లు ఏర్పాటు విషయం పక్కన పెడితే ఆయనపై వచ్చిన TRP Rating Scam టీఆర్పీ కుంభకోణం కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. తమ ఛానెల్ రేటింగ్ పెంచాలంటూ Arnab Goswami అర్ణబ్ తనకు రూ. 40 లక్షలు ఇచ్చారని BARC బార్క్ మాజీ సీఈఓ పేరుతో దాస్ గుప్తా ఆరోపించారు. టీఆర్పీ కుంభకోణం కేసులో లోతుగా విచారిస్తున్న Mumbai Police ముంబై పోలీసులకు పేరుతో అనేక కీలక విషయాలను వెల్లడించారు. మీడియా ఛానెళ్ల బాగోతాలు, రిపబ్లిక్ టీవీ నంబర్ వన్ గా నిలవడానికి రేటింగ్స్ లో చేసిన స్కామ్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేసారు.
టీవీ ఛానెళ్ల రేటింగ్స్ (టీఆర్పీలు) బార్క్ అధీనంలో ఉంటాయి. బార్క్ సీఈఓలను మేనేజ్ చేస్తే ఛానెళ్ల రేటింగ్ బాగా పెంచుకోవచ్చు అని అర్ణబ్ కి బాగా తెలుసు. నేను, అర్ణబ్ గతంలో టైమ్స్ నౌ లో కలిసి పని చేసాం. ఆ చనువుతో బార్క్ సీఈఓ గా నేను ఉన్న సమయంలో అర్ణబ్ నాకు డబ్బు ఇచ్చి తన ఛానెల్ రేటింగ్ పెంచుకునేలా చేశారు. నేను సహకరించారు. విడతల వారీగా రూ. 40 లక్షలు తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు మరోసారి అర్ణబ్ ని పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఇలా ముంబై మీడియాలో టీఆర్పీ స్కామ్ ని బయట పెట్టేసారు.
ష్… ముంబై పోలీసులు ఇటు రావద్దు..!!
మహారాష్ట్ర ప్రభుత్వం .. సీఎం ఉద్ధవ్ థాక్రేతో పేచీలు కారణంగా.. అక్కడి పోలీసులతోనూ అర్ణబ్ పర్సనల్ గా గోక్కొన్న కారణంగానే రిపబ్లిక్ టీవీ బాగోతం బయటకు వచ్చింది.. లేకపోతే ఇది ఎన్ని దశాబ్దాలు గడిచినా చీకట్లోనే ఉండేది. సాధారణంగా మీడియా అంటేనే మేనేజ్మెంట్. ప్రతి ఛానెల్ ఏదో పార్టీకి అనుసంధానంగా వ్యవహరిస్తోంది. అందుకే ఛానెళ్ళకి గతంలోలా లేవు. కానీ మేనేజ్ చేసుకునే కొద్దీ చానెళ్లకు మాత్రం విపరీత, నమ్మశక్యం కానీ రేటింగ్స్ వస్తుంటాయి. తెలుగులో కూడా ఇటువంటి రేటింగ్ మేనేజిమెంట్ స్కిల్స్ ఉన్న మీడియా అధినేతలు ఉన్నారు. తెలుగులో కొన్ని ఏళ్ళు తరబడి మూడు చానెళ్లు టాప్ – 3 లో కొనసాగుతున్నాయి. దీని వెనుక పెద్ద అస్త్రమే ఉంది. మన మీడియా ఒక ఛానెల్ అయితే మెరుగైన సమాజం అంటూ నీతులు చెప్తూ చెత్త వార్తలు ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆ ఛానెల్ ని నిత్యం యువత ఆదుకుంటూనే ఉంటారు. కానీ ఆ ఛానెల్ టాప్ లోనే ఉంటుంది. ఎందుకంటే… మహారాష్ట్ర ప్రభుత్వం/ ముంబై పోలీసుల్లాగా మన పోలీసులు దృష్టి పెట్టరు. అలా దృష్టి పెడితే తెలుగు మీడియా బార్క్ బాగోతాలు టన్నులు టన్నుల కొద్దీ బయటకు వచ్చేస్తాయి. అందుకే ష్… ముంబై పోలీసులు ఇటు రావద్దు..!!