NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్

ఏబీఎన్ ఆర్కే కొత్త తప్పులు…!

అక్షరమంటే దిక్కు .., దిక్సూచి… లక్ష్యం… ఉండాలి. అవి సదుద్దేశంతో ఉండాలి. అవి లేకపోతేనే “దిక్కులేని అక్షరాలు” అంటుంటారు. తెలుగునాట ఆ దిక్కులేని అక్షరాలకు ఆజ్యం పోసింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రమే.దిక్కు అంటే ఇక్కడ లక్ష్యం, మార్గం మాత్రమే పరిమితం కాదు… సిగ్గు కూడా వర్తిస్తుంది. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది…? రాధాకృష్ణ అంతగా తప్పు ఏం చేశారు..? ఆయన అక్షరాలు అంతగా ఏమి దారి తప్పాయో తెలుసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రధాన పత్రికల్లో అనుకుంటే ఒకే సొంత లక్ష్యాలు అనుకోవచ్చు.., కానీ జిల్లా పత్రికల్లోనూ ఇటువంటి అక్షర వంటలతో కాలక్షేపం చేస్తున్నారు.

నెలలో కేసీఆర్ మారిపోయారా…?

కేసీఆర్ పై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉవ్వెత్తున లేచాడు. కన్నెర్ర చేసాడు. పేజీలు, పేజీలు రాసేసాడు. చెత్త పాలన అన్నాడు. దొరల్లా ఉంటె కుదరదు అన్నాడు. అనేక కొత్త పలుకులు పలికాడు. కేసీఆర్ అహంతో ఉన్నాడని, నియంతలా పరిపాలిస్తున్నాడని రాసుకొచ్చాడు. (ఇవన్నీ ఏప్రిల్ 26 న వచ్చిన కొత్తపలుకులో చూడొచ్చు)..! అంటే రాధాకృష్ణ భావం ఏంటి..? కేసీఆర్ కి వ్యతిరేకమా…?? సరే కాసేపు ఇలాగే ఫిక్సయిపోదాం. మరి…! కేసీఆర్ తెలంగాణను దక్షిణ కొరియాలాగా అభివృద్ధి చేసేస్తున్నాడు…! ఆరేళ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ సిక్సర్ కొట్టాడు. కేసీఆర్ అభివృద్ధిని ఎవరూ అందుకోలేరు. అంటూ మళ్ళీ రెండు రోజుల కిందట రాసాడు. అంటే కేసీఆర్ కి రాధాకృష్ణ అనుకూలమా…?? కాదు. అక్కడ ఆ అక్షరానికి పైన చెప్పుకున్న లక్షణాలు ఏమి ఉండవు. అక్షరం అమీబాలాగా ఆకారం లేకుండా తిరుగుతూ, మారుతూ ఉంటుంది. మరి ఆంధ్ర లో జగన్ విషయంలో అలాగే ఉండొచ్చుగా, దిక్కులేని అక్షరాన్ని ప్రయోగించవచ్చుగా అనుకుంటారేమో… ఇక్కడ కులం, వర్గం అడ్డు వస్తుంది. పైగా అక్కడ (తెలంగాణ లో) చంద్రబాబు అనేవాడు రాజకీయంగా లేడు. ఇక్కడ చంద్రబాబు అనేవాడు ఉన్నాడు, రాధాకృష్ణ అనేవాడు ఆయనకు అక్షర బంటుగా ఉంటున్నాడు.

మధ్యలో దూరిపోవడం అలవాటే…!

ముఖ్యమంత్రి , మంత్రి మాట్లాడుకుంటే బయటకు వాస్తవాలు వస్తాయా…? ముఖ్యంన్త్రి, ప్రధానమంత్రి మాట్లాడుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయా…? అవేం రావు. వాళ్ళు నేరుగా చెప్తేనే, లేదా ప్రకటన రూపంలో ఇస్తేనే రాయాలి. కానీ ఆంధ్రజ్యోతిలో మొదటి నుండి ఒక చెత్త సంస్కృతి ఉంది. ఇద్దరు భేటీ అయితే దానిపై తనకు తోచింది, తాను అనుకున్నది ఊహించుకున్నది వారు మాట్లాడుకున్నది రాసెయ్యడం అలవాటే. ఈరోజు ప్రకాశం జిల్లాలో వచ్చిన ఒక వార్తే అందుకు ఉదాహరణ. నిన్న సీఎం జగన్, మంత్రి బాలినేని కలిశారు.

జిల్లాలో రాజకీయాలు మాట్లాడుకున్నారు. “వాళ్లిద్దరూ చీరాలపై మాట్లాడుకున్నారట. కరణం బలరాం కి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకున్నారట.., అలాగే ఆమంచిని కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నారట. సిఐ, ఇతర బదిలీలపై చర్చించారట… జిల్లాపై ఏకాంతంగా మాట్లాడుకున్నారట..” ఇదీ ఈరోజు ఆంధ్రజ్యోతి లో వచ్చిన వార్తా సారాంశం. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు, రాసేస్తూ తన సొంత అక్షరం ఉపయోగించడం పత్రికకు అలవాటుగా మారింది. ఇదే తరహాలో చీరాలలో తనకు కావాల్సిన కరణం విషయంలో అనుకూలంగా నేరుగా సీఎం జగన్, మంత్రి బాలినేని చెప్పినట్టు రాసుకొచ్చారు. కానీ అక్కడ జరిగిన వాస్తవాలు వేరు
“నిన్న ఉదయం సీఎం జగన్ తో మంత్రులు బాలినేని, కొడాలి నాని, విజయసాయిరెడ్డి లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలు, ఢిల్లీ పర్యటన రద్దు, సుప్రీం కోర్టులో పిటిషన్ అంశాలపై మాట్లాడుకున్నారు. రానున్న వారంలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై మాత్రమే గంట మాట్లాడుకున్నారు” ఆ తర్వాత విజయసాయిరెడ్డి, బాలినేని కలిసి అరగంట మాట్లాడుకున్నారు. అక్కడ మాత్రమే చీరాల చర్చ వచ్చింది. వారిద్దరూ చీరాల తాజా అంశాలపై మాట్లాడుకున్నారు. సీఎం జగన్ వద్ద ఈ టాపిక్ రాలేదు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. నిజానికి జగన్ స్వభావం, వ్యక్తిత్వం తెలిసిన వారు… దీన్ని అంగీకరించరు. జగన్ ఇటువంటి వ్యవహారాలను నేరుగా మాట్లాడరు. విజయసాయి ద్వారానే నడిపిస్తుంటారు. కానీ జ్యోతిలో ఈ వార్తా చూసి జిల్లాలో నవ్వులాట మొదలయ్యింది.

ఇసుకపైనా సొంత రాతలు…!

ఇక ప్రభుత్వం పెన్ను ఎత్తడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా?? అని ఎదురు చూసే రాధాకృష్ణకు రెండు రోజుల నుండి ఇసుక అంశం దొరికింది. దీనిపై గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాధాకృష్ణ వాటిని కొనసాగించి డైలీ సీరియళ్లు మొదలు పెట్టారు. నేరుగా ఆ పార్టీ ఎంపీ రఘు రామ్ కృష్ణం రాజు ఇంటర్వ్యూ చేసి… ఆయన ద్వారా జగన్ పై విమర్శలు గుప్పించి… సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలే జగన్ పై గుర్రుగా ఉన్నారు అనేలా రాసుకొచ్చారు. నిజానికి ఇదే వార్తా ఈనాడులోనూ వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు, అవినీతిని రాశారు. కానీ జ్తయోటిలో మాత్రం రాజకీయాలు అద్ది, పూర్తిగా వైసిపి లో చిచ్చు , తన శత్రువు జగన్ సీటుకి తగిలేలా, సొంత వ్యాఖ్యలు జోడించి రాశారు. నిజానికి ఈ రాతలు, ఈ అక్షరాలా వలన జగన్ కి జరిగే నష్టం పెద్దగా ఉండదు కానీ, చంద్రబాబు ఒరిగే లాభం ఏమి ఉండదు. కానీ జర్నలిజమే దిక్కులేనిది.., అక్షరమే దిక్సూచి లేనిది అయిపోతుంది.

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju