Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ప్రఖ్యాతి గాంచిన నాయకుడు వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు వరుసగా రెండవ సారి ఉప రాష్ట్రపతి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కొంత మంది అయితే ఆయనకు రాష్ట్రపతి పదవి వరిస్తుందని భావించారు. బీజేపీలో సీనియర్ నేత, చాలా కాలం క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగానూ పని చేశారు. పై స్థాయిలో పరిచయాలు ఉండటం వల్ల ఆయనకు రాష్ట్రపతి పదవి వరిస్తుందని భావించారు. ఓ వర్గం మీడియా కూడా ఆయనకు రాష్ట్రపతి పదవి వరిస్తుంది అన్నట్లుగా కూడా ఫోకస్ చేసింది. అయితే న్యూస్ ఆర్బిట్ ముందుగానే వెల్లడించింది. వెంకయ్యనాయుడికి అవకాశం లేదు. ఎస్టీ మహిళ లేదా ముస్లిం మైనార్టీ నేతకు రాష్ట్రపతి అవకాశం ఇవ్వబోతున్నారు అని న్యూస్ ఆర్బిట్ కథనం ఇవ్వడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడిని మరో సారి కొనసాగిస్తారు అని వార్తలు షికారు చేస్తున్నాయి. బీజేపీ నుండి వస్తున్న సమాచారం ఏమిటంటే వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతిగా కూడా మరో సారి అవకాశం కల్పించడం లేదు. ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఉన్న ఎండీ ఆరీఫ్ ఖాన్ కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అధికారికంగా బీజేపీ ఇప్పటి వరకూవెల్లడించకపోయినా దాదాపు ఆరీఫ్ ఖాన్ పేరును ఉప రాష్ట్రపతికి ఖరారు చేసినట్లు సమాచారం. దీని వెనుక బీజేపీకి ఒక స్ట్రాటజీ, ప్లాన్ ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా ఎస్సీ వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ కు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఎస్టీ మహిళ కు బీజేపీ అవకాశం ఇచ్చింది. గతంలో వెంకయ్య నాయుడికి ప్రత్యేక అవసరాల నిమిత్తం ఉప రాష్ట్రపతి అవకాశం ఇచ్చారు.
ఇప్పుడు ముస్లిం మైనార్టీకి చెందిన నాయకుడికి ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం వల్ల బీజేపీ చాలా ప్రయోజనాలు ఆశిస్తొంది. దేశంలో బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అన్న భావనను తుడిచి వేయడానికి గానూ ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పించాలని భావిస్తొంది. అదే విధంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. మరో పక్క అరబిక్ దేశాలతో భారతదేశ సంబంధాలపైనా ఆ ప్రభావం పడింది. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు అని చెప్పుకోవడంతో పాటు ఈ వివాదాలను బయటపడేందుకు పార్టీ వ్యాహాత్మకంగా ఈ చర్యలు తీసుకుంటోంది. ఏపీలో వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం పాటించామని చెబుతోంది. అదే మాదిరిగా కేంద్రంలోని బీజేపీ కూడా ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలకు ఉన్నత పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించామని చెప్పుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఆరీఫ్ ఖాన్ కు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వబోతున్నారు అన్న విషయం తెలుసుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముందుగానే ఆయనను కలిసి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు కూడా తెలియజేసి వచ్చారు.