వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు స్టోరీ చాలానే ఉంది. ఆయన పత్తిత్తులా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాం గానీ… ఈ చిల్లర పంచాయితీ వెనుక చాలా సినిమా ఉన్నట్టుగా కన్పిస్తోంది.
చాన్నాళ్ల కిందటే రఘురామకృష్ణరాజు బీజేపీలోకి వచ్చేస్తానంటూ కమలం పెద్దలకు చెప్పారట. అయితే కొంచెం వెయిట్ చేయాలంటూ వారు సూచించారట… ఏడాది పూర్తయ్యింది కదా ఇక నేనాగలేను… దంచుతానంటూ మనోడు రంగంలోకి దిగగా… హస్తిన పెద్దల నుంచి కూడా క్లారిటీ వచ్చిందంట. అందుకే ఆయన గారు వైసీపీపై విమర్శల దాడి పెంచేశారు. స్వపక్షంలో విపక్షం అంటే ఎంటో అధికార పార్టీకి చూపిస్తున్నారు.
రఘురామకృష్ణరాజు మాటల్లో సీనియర్ గానీ… రాజకీయాల్లో జూనియరే.. చచ్చీచెడీ మొన్న ఎన్నికల్లో బయటపడ్డ రాజుగారికి ఫ్యూచర్ క్లారిటీగా కన్పిస్తోంది. పనిలేని వాడు దేనిదో గొరిగాడన్నట్టుగా ఉంది ఆయనగారి సిట్యూవేషన్. రఘురామరాజుపై వేటేయాల్సిందిగా వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే రాజు మాత్రం ఎంపీల ఫిర్యాదును లైట్ గా తీసుకుంటున్నాడు. కంప్లైంట్ లేదు. కాకరగాయ లేదంటూ కస్సుబుస్సులాడుతూ ఓవర్ స్పీడ్ మాటలతో దూకుడు పెంచేస్తున్నాడు.
ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన రాజు… ఇష్యూ ఎంత కాలం లాగితే అంత మంచిదన్న చందంగా ఉన్నారు. నాలుగేళ్లు ఎంపీగా ఎలగబెట్టేందుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా అటు ఢిల్లీలో పైరవీలు… ఇటు న్యాయపరంగా చిక్కులు లేకుండా ఓ రేంజ్ లో స్కెచ్ వేశారట.
మొన్నటి వరకు వేటు, బోటు, సీటు అంటూ తన ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడిన రాజు… ఇప్పుడు గొంతు పెంచి మాట్లాడుతున్నారు. తన మాటకు కొన్ని మీడియాల్లో పలుకుబడి ఉందన్న కారణంతో రాజు ఓ రేంజ్ లో దకూడు పెంచి మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న అమరావతి రైతులకు సంఘీభావంగా… రాజధాని మార్పును ఎవరు అంగీకరించరంటూ వాయిస్ రెయిజ్ చేసిన ఈ ఎంపీ ఇవాళ మరో అడుగు ముందుకేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ సంధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ను పెంచాలంటూ లేఖ రాశారు. ఏడాదికి రూ. 250 పెంచుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా రూ. 250 పెంచాలంటూ లేఖాస్త్రం సంధించారు.
మొత్తంగా రాజు దూకుడు వెనుక సంథింగ్ సంథింగ్ ఉందని మాత్రం అర్థమవుతుంది. ఇటీవల విద్యుత్ ఛార్జీల విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం… రాజు గారి దూకుడు… టీడీపీలోంచి బీజేపీలో చేరిన నేతల హడావుడి అన్నీ కూడా సింకవుతున్నాయ్. మొత్తంగా ఇప్పుడు వైసీపీ సర్కారుకు రఘురామకృష్ణరాజు కంట్లో నలుసు. ఈ నలుసుకు ఏవిధంగా వైసీపీ పెద్దలు బదులిస్తారన్నదానిపై మొత్తం స్ట్రాటజీ ఆధారపడి ఉంది.