మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగాల్సిన కీలకమైన భేటీ రద్దయింది. కరోనా వైరస్ తీవ్రత మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం వల్ల అమిత్ షా ఒక్కసారిగా బిజీ అయిపోవడంతో అతని షెడ్యూల్ లో జగన్ అప్పాయింట్ మెంట్ కు సమయం దొరకక ఆఖరి నిమిషంలో రద్దు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. కానీ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచుకొని ఉండే ఎల్లో మీడియా…. బీజేపీ నేతలు కొందరు అమిత్ షా కు చెప్పి మరీ జగన్ అపాయింట్మెంట్ రద్దు చేయించారు అని ప్రచారం మొదలు పెట్టేశారు.
గతంలో కూడా జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు అనివార్య కారణాల వల్ల అది రద్దు కావడం చాలాసార్లు జరిగింది. కానీ ఎల్లో మీడియా వారి వాదన ప్రకారం బిజెపిలోని పార్టీ నేతలు…. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం ప్రాముఖ్యత లేని నేతలు చెప్పగానే అపాయింట్మెంట్ రద్దు చేసేంత బలహీన స్థితిలో హోంమంత్రి ఉన్నాడా అని వైసిపి వర్గాల నుంచి బలమైన వాదనలు వినిపించడంతో నోరు మూసుకోవటం ఆ మీడియా వంతు అయింది. అలాగే వారు అక్కడితో అయినా తమ తప్పు తెలుసుకొని ఆగారా అంటే.. అదీ లేదు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సుప్రీం కోర్టులో ఫిర్యాదు మరియు తాము ప్రభుత్వ వ్యతిరేక పోరు చేస్తున్న కారణంగా జగన్ ను కలవద్దని ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది కమలనాథులు చెప్పగానే అమిత్ షా హుటాహుటిన అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని వార్తలు ఎల్లో మీడియా నుండి బలంగా వినిపించగా…. జగన్, అమిత్ షా కలిస్తే రాష్ట్రంలో బిజెపి కి వచ్చే నష్టం ఏమిటో?
ఇక ప్రభుత్వం పై పొరులో బిజెపి నేతలు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఈ మీటింగ్ బలహీనం అయిపోతుందని బిజెపి నాయకులు అనుకుంటే దానికన్నా పెద్ద హాస్యభరితమైన అంశం మరొకటి ఉండదు. కన్నా వ్యవహారశైలిపై పార్టీలోని నేతలే కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి రాష్ట్రంలో బిజెపి బలపడేది కల్లమాత్రమే. జగన్ మద్దతుదారులు అంతా ఈ అర్థంలేని వార్తలు విని సోషల్ మీడియా లో ఎల్లో మీడియా ను విపరీతంగా తిట్టిపోస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా పేజీలు ఎల్లో మీడియా పై విపరీతమైన ట్రోల్స్ వేస్తూ వారికి సరైన సమాధానాలు ఇస్తూ ఆ రాతలు రాసే వారిని గుక్క తిప్పుకోనివ్వనివ్వకుండా చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?