ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న దూకుడును ఎవరు ఆపలేక పోతున్నారు. ఒక దెబ్బ తర్వాత మరొకటి కొడుతూ తెలుగుదేశం పార్టీపై ఆయన విరుచుకుపడుతున్న తీరు వైసిపి వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక అటువైపు చూస్తే తెదేపా వారు…. ఏపీ ప్రభుత్వం టిడిపి నేతలను అక్రమ అరెస్టు చేయిస్తున్నారని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు నిరసనలు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు మాట విని చింతమనేని వంటి వారు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు కానీ మిగిలిన నేతలందరూ మాకెందుకు ఈ గొడవ అన్నట్లు ఒక మోస్తరుగా స్పందించారు. ఇక కార్యకర్తల్లో కూడా పెద్దగా స్పందన ఏమీ లేదు.
ఇలాంటి సమయం లోనే ఒక ముగ్గురు మాజీ మంత్రులు మాత్రం కనపడీ కనపడకుండా పార్టీలో తిరుగుతున్నారు. బాబు చెప్పింది మాకు కాదు అనుకున్నారో లేదో జగన్ టేబుల్ పైన ఉన్న మా ఫైళ్ళ టెన్షన్ లో మేము ఉంటే ఆయనకు వ్యతిరేకంగా ఇప్పుడు గళం ఎలా విప్పమంటారు అని విపరీతంగా భయపడుతున్నారట. దానికి తగ్గట్లుగానే జగన్ వద్దకు తర్వాత లిస్టులో ఈ ముగ్గురు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చేశాయి అని టాక్. ఇక వారి ముగ్గురు పేర్లు చూస్తే ఒకరు గంటా శ్రీనివాసరావు కాగా మరొకరు నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ నారాయణ. ఇక మూడవ వ్యక్తి ఎప్పటినుండో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్తిపాటి పుల్లారావు.
జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో నాడు–నేడు కీలకమైనది. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు యొక్క శాఖలో ప్రాథమికోన్నత పాఠశాలలకు రంగులు వేసే కార్యక్రమంలో తీవ్రంగా అవినీతి జరిగిందని ఆరోపణలతో పాటు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయట. అరకొర పాఠశాలకు రంగులు వేసి మిగతాదంతా సైడ్ చేశారని చెబుతున్నారు. ఇక అసలు ఏం జరిగిందన్న విషయంపై ఇప్పుడు ప్రభుత్వం తవ్వుతుండగా గంటా శ్రీనివాసరావు దీనిలో చిక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక రెండో మాజీ మంత్రి అయిన పొంగూరు నారాయణ ఇప్పటికే సీఆర్డీఏ భూములు, అమరావతి కంపెనీల విషయంలోనూ మరియు రాజధాని భూముల విషయంలోనూ ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని వైకాపా నేతలు నమ్ముతున్నారు. ఇక తర్వాత వేసేది కూడా నారాయణనే వారికి హైకమాండ్ నుండి కొన్ని సూచనలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో నకిలీ పురుగుల మందుల తయారీకి సహకరించి తద్వారా అవినీతికి పాల్పడ్డారని ప్రత్తిపాటి పుల్లారావు పైన అనేకానేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పుల్లారావు సతీమణి వెంకాయమ్మ తో పాటు ఆయన కుమారుడు పైన కూడా ఈ అవినీతిలో హస్తం ఉందని ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ ఏపీ సర్కారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పై ఉక్కుపాదం మోప నిర్ణయించుకుంది అని స్పష్టంగా అర్థం అవుతోంది. అనుకున్నదే తడవుగా బాబు పాలన పై సిబిఐ కేసులు వేయడం మరియు అవినీతికి పాల్పడ్డారని ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులను మూసేయడం చూస్తుంటే జగన్ తన దూకుడును ఇప్పటిలో తగ్గించేలా లేరు కాబట్టి చంద్రబాబు జగన్ ను నిలువరించడానికి ఏదైనా ప్రతి వ్యూహం ఆలోచిస్తే బెటర్ లేదంటే. 30 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పార్టీ కొద్ది నెలల్లో భూస్థాపితం అయిపోవడం ఖాయం.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!