Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు ఏడుగురు. రేవంత్, ఫైమా, సుల్తానా, అభినయశ్రీ, శ్రీ సత్య, చంటి, ఆరోహి. అయితే వీరిలో చంటి, శ్రీ సత్య శనివారం ఎపిసోడ్ లో సేఫ్ కావడం తెలిసిందే. ఇంకా మిగిలిన ఐదుగురు ఆదివారం జరగనున్న ఎపిసోడ్ లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున శనివారం ప్రకటించారు.
దీంతో మిగిలిన ఐదుగురు రేవంత్, ఫైమా, సుల్తానా, అభినయశ్రీ, ఆరోహి లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది పెద్ద సస్పెన్స్ గా ప్రేక్షకులలో మరియు బిగ్ బాస్ హౌస్ లో నెలకొన్నగా.. తీరా ఆదివారం ఎపిసోడ్లో అందరూ సేఫ్ జోన్ లో ఉన్నట్లు ఎవరిని ఎలిమినేట్ చేయడం లేదని నాగార్జున ప్రకటించడం ఐదుగురికి షాక్ ఇచ్చినట్లయింది. ఐదుగురికి మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా వాళ్ళకి కూడా గట్టిగానే షాక్ ఇచ్చినట్లు పరిస్థితి మారింది. అందరి లెక్కలు బిగ్ బాస్ తారుమారు చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ పరిణామంతో బిగ్ బాస్ షో ఆడియన్స్ మండిపడుతున్నారు.
ఎవరిని ఎలిమినేట్ చేయకపోతే ఎందుకు మరి.. ఓటింగ్ పోల్స్ పెట్టారని.. సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఓటింగ్ పోల్స్ పెట్టకుండా హిందీ బిగ్ బాస్ మాదిరిగా.. ఇంటిలో ఉన్న సభ్యులకు మాత్రమే షాక్ ఇచ్చే విధంగా వ్యవహరిస్తే బాగుండేది. అనవసరంగా ఇంటిలో ఉన్న సభ్యులను చూసే ప్రేక్షకులను తప్పు దోవ పట్టించే విధంగా మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఉందని మండిపడుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో మొదటివారం ఎవరు ఎలిమినేట్ కాకపోవడం చూసే ప్రేక్షకులకు హౌస్ లో ఉన్న సభ్యులకు ఊహించని షాక్. గత ఐదు సీజన్లలో ఎప్పుడూ కూడా ఈ రీతిగా షో నిర్వాహకులు వ్యవహరించలేదు.