పలు ప్రైవేటు బ్యాంకుల్లో కస్టమర్స్ మినిమం బ్యాలెన్స్, క్యాష్ విత్ డ్రా.. అంశాల్లో కొత్త నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు తీసుకురానున్నాయి. ఆగష్టు 1నుంచి అమలు చేసే బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆర్బీఎల్.. ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పట్టణాలు, నగరాల్లో 2000, గ్రామీణ ప్రాంతాల్లో 1500 మినిమం బ్యాలెన్స్ ఉండాలి.
కరెంట్ అకౌంట్ హోల్డర్స్ మినిమం బ్యాలెన్స్ రూ.5000 ఉండాలి. మెట్రోల్లో రూ.75, అర్బన్ లో 50, రూరల్లో 20 ఫైన్ విధిస్తారు. ఏటీఎమ్స్ లో మొదటి 3 ట్రాన్సాక్షన్స్ ఉచితమే. తర్వాత ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తారు. లాకర్ డిపాజిట్ తగ్గించి రెంట్ ఎరియర్స్ పెనాల్టీని పెంచారు. యాక్సిస్ బ్యాంక్ ఈసీఎస్ లావాదేవీలపై ఇప్పటివరకూ సున్నాగా ఉన్న దానిపై రూ.25 వసూలు చేయనున్నారు. పరిమితికి మించి లాకర్ చార్జీలను రూ.10, 20, 50 నోట్లపై బండిల్ పై క్యాష్ బాండ్లింగ్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తారు. ఏటీఎమ్ లావాదేవీల్లో 5 వరకూ ఉచితమే. ఆపై ప్రతి లావాదేవీపై రూ.20 వసూలు చేస్తుంది.
సరైన బ్యాలెన్స్ కానీ.. ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ పై రూ.25 వసూలు చేస్తారు. కోటక్ మహీంద్రాలో మినిమం బ్యాలన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే అకౌంట్ కేటగిరీని బట్టి ఫెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. మొదటి మూడు లావాదేవీలు ఉచితమే. తర్వాత ట్రాన్సాక్షన్ పై రూ.100 చార్జీలు వసూలు చేస్తారు.