ED Xiaomi: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమి ఇండియాకు చెందిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆస్తులను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఆస్తుల విలువ సుమారు 5,551.27 కోట్ల రూపాయలు. షావోమి భారతదేశానికి చెందిన మన విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించి నందుకు ఈడీ .. ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014 నుండి ఇండియాలో షావోమి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో వ్యాపారం స్టార్ట్ చేసిన నాటి నుండి షావోమి ఇండియా అక్రమాలకు పాల్పడినట్లు ఈడి గుర్తించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో గత ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై వీడియో అధికారులు దాడులు చేశారు. భారీగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మూడు విదేశీ సంస్థలకు షావోమి ఇండియా కంపెనీలకు ఎలాంటి సేవలు పొందకపోయినా భారీగా నగదును మళ్ళించింది. దీని కోసం తప్పుడు పత్రాలు సృష్టించింది. ఇదే సమయంలో బ్యాంకులకు తప్పుడు సమాచారం అందించినట్లు ఈడి గుర్తించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీన్ని ఫెమా ఉల్లంఘనగా అధికారులు గుర్తించారు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ సహా ఇతర ప్రాంతాల్లో షావోమి కార్యాలయాలపై వీడియో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించరు. ఈ క్రమంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కంపెనీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు వెంటనే… నాలుగు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నగదును ఈడి జప్తు చేయడం జరిగింది. మరోపక్క షావోమి ఇండియా ఆర్థిక లావాదేవీలు చెల్లించిన అన్ని పూర్తిగా చట్టబద్ధమైనవి. ఈ విషయంలో నెలకొన్న అపార్ధాలు నివృత్తి చేయటానికి ప్రభుత్వ వర్గాల తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సంస్థ తెలిపింది.