దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బీఐ తన ఖాతాదారుల కోసం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ‘ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020’ పేరుతో వచ్చిన స్కీమ్ తో తక్కువ ఎఫ్ డీతో ఎక్కువ వడ్డీ అందించడమే బ్యాంక్ లక్ష్యం. జూలై 1నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ ద్వారా ఈ పథకంలో బాండ్లు జారీ చేస్తుంది. ఈ పథకంలో వడ్డీ 7.15 శాతం వస్తుంది. ఎఫ్ డీ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది.
ఈ పథకంలో ఆరు నెలలకోసారి వడ్డీ రావడం స్పెషల్. ఈ బాండ్లను ఎస్ బీఐతో సహా చాలా బ్యాంకుల్లో కోనుగోలు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ, హెడ్ డీ ఎఫ్ సీ.. వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ బాండ్లు లభ్యమవుతాయి. బాండ్లు కొనుగోలు చేసిన వెంటనే ఇవి కస్టమర్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ కు ట్రాన్ప్ ఫర్ అవుతాయి. ఇందుకు ఈ బాండ్లను ఎలక్ట్రానికి రూపంలో కొనుగోలు చేయాలి. నగదు రూపంలో బాండ్లు కొనుగోలు చేస్తే రూ.20వేల రూపాయల వరకూ మాత్రమే పరిమితి ఉంది.
ఆన్ లైన్ లో మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 1000 రూపాయల వరకూ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గరిష్ట పరిమితి లేదు. ఈ బాండ్ల మెచ్యూరిటీ కాలం 7ఏళ్లు. ప్రతి ఏటా జనవరి 1, జూలై7వ తేదీల్లో వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.