ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో పయనించడం.., అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో రూపాయి బలపడుతోంది. నిన్నటికి రూపాయి 17 పైసలు పెరిగి 74.74 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంతో 74.79 వద్ద ప్రారంభమైన రూపాయి గరిష్టంగా 74.73.. కనిష్టంగా 74.87 వద్ద సూచించింది. మొత్తానికి 74.74 వద్ద స్థిరపడింది.
రీసెంట్ గా స్టాక్ మార్కెట్లు బలపడుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ వ్యాల్యూ తగ్గడంతో నాలుగు నెలల కనిష్టానికి చేరుకుంది. దేశీయ ఈక్విటీలు, కరోనా వ్యాక్సీన్ పై ఆశలు, విదేశీ ఫండ్స్ ఇన్ఫ్లో వంటి అంశాలు రూపాయిని బలపర్చాయని అంటున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్, ఇండియాలో కోవాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమవడం ఆశలు రేకెత్తిసోంది.
స్టార్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగుస్తున్నాయి. ఏప్రిల్ నెల నుంచీ చమురు ధరలు కూడా రోజు రోజుకీ మారుతున్నాయి. మంగళవారం స్వల్ప మార్పులు జరగ్గా ఈరోజు స్థిరంగానే ఉంది. లాక్ డౌన్ పరిస్థితుల అనంతరం చమురు ధరల్లో మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో ఈరోజు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర్ బ్యారెల్ కు 0.11 శాతం పెరిగింది. దీంతో 44.02 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 0.74 తగ్గి 41.61 డాలర్లకు తగ్గింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?