ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని వేల్లమంది గుండె పోటుతో చనిపోతున్నారు .. కచ్చితమయిన ఆహారం , వ్యాయామం ఇలా సరైన జీవన విధానం పాటించాలి . అప్పుడే ఇలాంటి సమస్యలనుండి బయట పడవచ్చు . కొంతమంది ఫస్ట్ స్ట్రోక్ కే చనిపోగా ,మరి కొంతమంది రెండోసారి , మూడోసారి స్ట్రోక్స్ కి మరణిస్తున్నారు .
మొదటి సారి గుండెనొప్పి వచినప్పటినుండి జాగ్రత్తగా ఉండడం చాల అవసరం అని చెబుతున్నారు నిపుణులు. అయితే , గుండె నొప్పుల గురించి చేసిన పరిశోధనల్లో కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు తెలిశాయి . అవి ఏంటంటే . సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఏ రోజుల్లో అయినా సరే గుండెపోటు వచ్చిన వారికంటే శని ,ఆదివారాల్లో గుండెపోటు వచ్చినవారు బతికే అవకాశాలు తక్కువ అని సైంటిస్టులు చెబుతున్నారు .ఈ విషయం లో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు . ఫిలా ఢిల్ల్ఫియాలో ఇటీవల జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ సైన్స్ సింపోజియం 2019 సదస్సు లో యూకే కి చెందిన పలువురు పరిశోధకులు సర్వైవల్ టు హాస్పిటల్ అడ్మిషన్ అనే అంశం పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు
.ఈ పరిశోధనలో భాగంగా, వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3 వేల మందికి చెందిన డేటా ను సేకరించి విశ్లేషించారు . దానిలో వచ్చిన ఫలితాలని బట్టి సైంటిస్టులు చేబుతున్నదేమిటంటే , మిగతా రోజుల కన్నా శనివారం రాత్రి 12 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల మధ్య గుండెపోటు వచ్చిన వారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే బతికారని తేలింది .వయసు పెరిగే కొద్దీ సమస్య పెరుగుతుందని చెబుతున్నారు .