పిల్లలు చెడు అలవాటు అయినా మంచి అలవాటు అయిన పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటారని గుర్తు పెట్టుకోండి. వాళ్ల కు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు. వాళ్లు ఎలా చేస్తే పిల్లలు కూడా అలా చేస్తారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మొబైల్స్కు బానిసలవుతున్నారు.ఆఖరకు ఆహారం తినేటప్పుడు సైతం వాటిని వదిలి పెట్టడం లేదు.తమ తల్లిదండ్రులు అంతగా చూస్తున్నారంటే అందులో ముఖ్యమైనది ఏదో ఉందని పిల్లల కు అనిపించక మానదు. వాళ్లూకూడా ఆ పద్దతిని అనుసరిస్తారు. కాబట్టి కనీసం పిల్లలు మీ పక్కన ఉన్న సమయంలో అయినా మొబైల్ వాడకుండా ఉండండి. వీలైనంతగా వాళ్ల తో కలిసి సమయం గడపండి.
ఈ రోజు ల్లో పిల్లలు మొబైల్గేమ్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియాకి చాల ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అప్పుడే అన్నం తినడం మొదలుపెట్టిన చిన్నారులు కూడా స్మార్ట్ఫోన్లో వీడియోలుచూపించక పోతే ముద్ద మింగని పరిస్థితి.ఫోన్లకు బానిసలయిన పిల్లలను మాములు స్థితి కి తేవాలంటే తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటించి తీరవలిసిందే.పిల్లలను ఫోన్ లకు వదిలేయకుండా వారి చదువు ను పట్టించుకుంటూ కుదిరినప్పుడల్ల వారిని బయటికి తీసుకు వెళ్లి ఆడుకోమనాలి. ఇండోర్ గేమ్స్ కాకుండా ఔట్ డోర్ గేమ్స్ ఆడమనాలి .ఆ ఆటలలో పిల్లల తో పాటు పెద్దలు కూడాఆడుతుంటే పిల్లలు త్వరగా సోషల్ మీడియాకి దూరమవుతారు. గ్యాడ్జెట్స్ ,సోషల్ మీడియా అనేవి బలమైన ఆయుధాలుగా చెప్పాలి. వాటితో ఆడితే ఖచ్చితం గా ప్రమాదం జరగక మానదు… కాబట్టి వాటినుంచి పిల్లల్ని దూరం చేయండి … అలా చేయాలంటే వారికి డ్యాన్స్,పెయింటింగ్, సంగీతం ఇలా వారి ఆసక్తిని బట్టి వాటిని నేర్పించే విధం గా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వలన వల్ల పిల్లలని సోషల్మీడియాకి దూరం చేయొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా మొబైల్లో వీడియో గేమ్స్కు బానిసలవుతూ , వాటి పై ఆసక్తి చూపే వారి సంఖ్య రోజు ,రోజుకు పెరుగుతుండడం చూసి, ప్రపంచ ఆరోగ్య సంస్థ గేమింగ్ వ్యసనాన్ని ఒక రకమైన మానసిక వ్యాధిగా నిర్దారించింది .
కాబట్టి ప్రయత్న పూర్వకంగా సోషల్ మీడియాకు దూరం చేయకపోతే వారి బంగారు భవిష్యత్తు అంధకారం అవుతుంది.పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.