Radheshyam: యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమా “రాధేశ్యామ్” విడుదలకి ముందే ఓటీటీలో రికార్డుల దిశగా పయనిస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజి ఓ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి రెండో భాగం తర్వాత ఆయన సాహి లో నటించారు. ఈ సినిమాకు రూ. 250 కోట్ల వరకు పెట్టగా.. కొంత నష్టాల్లోనే ముగిసింది. ఈ సారి మాత్రం పకడ్బందీగా .. ఒక మంచి స్క్రిప్ట్ తో రాధేశ్యామ్ గా ప్రభాస్ రెడీ అవుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా అందిన ఒక అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్ని రూ. 400 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి అమెజాన్ ప్రైమ్ బేరం పెట్టినట్టు సమాచారం. ఈ చిత్రానికి మొత్తం మీద రూ. 300 కోట్లు వరకు బడ్జెట్ పెడుతుండగా.., అమెజాన్ ఒక క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. దీనిపై తమ భాగస్వాములతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఆ చిత్ర నిర్మాణ భాగస్వామి ఒకరు తెలిపారు. రూ. 400 కోట్లకు కొనుగోలు చేసి.. థియేటర్ రైట్స్, సాటిలైట్ రైట్స్ అన్ని అమెజాన్ దగ్గరే పట్టుకోవాలనిధి వారి ప్రణాళిక కావచ్చు. దీనిపై మరింత అప్డేట్ రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక ఒక క్రేజీ ఆఫర్ గా చెప్పుకోవచ్చు. 75 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ తర్వాత రెండు నెలల్లో విడుదలకు సిద్ధమవుతోంది.