సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా ఉంటున్నారు.. కుర్ర హీరోలకు తాము ఏమాత్రం తగ్గమంటూ.. వారికి పోటీగా సినిమాలు చేస్తున్నారు.. గతంలో ఒకేరోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే మాత్రం అభిమానులకు పండగలా ఉండేది.. ఎందుకంటే అప్పుడు హీరోల మధ్య గట్టి పోటీ ఉండేది. ఎవ్వరూ తగ్గేవారు కాదు.. నువ్వా.. నేనా అన్న రేంజ్ లో పోటీపడి సినిమాలు విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. బాక్సాఫీస్ లెక్కలు పరిగణలోకి తీసుకొని ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. ఇప్పుడు మరోసారి ఇద్దరు పెద్ద హీరోల మధ్య వార్ ఫిక్స్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి – కింగ్ నాగార్జున నటించిన చిత్రాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నాయి. చిరంజీవి నటించిన ‘లూసీఫర్’, నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న విడుదల అవుతున్నాయి. అయితే ఘోస్ట్ విడుదల తేదీని ముందే ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పోటీ తప్పడం లేదు. ఎందుకంటే దసరా సీజన్ ని టార్గెట్ చేసి ఈ సినిమాలు వస్తున్నాయి.
ఈమధ్య ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది.. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే.. ఎవరికో ఒకరికి దెబ్బ పడుతుంది. అందుకే నిర్మాతల అండర్ స్టాండింగ్ సహా హీరోలిద్దరూ కూర్చొని మాట్లాడుకుని విడుదల తేదీని మార్చుకుంటున్నారు. ఇక చిరంజీవి, నాగార్జున స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసులో నాగార్జున కంటే చిరంజీవి పెద్ద.. అందుకే అన్నయ్య అని పిలుస్తుంటాడు నాగ్.. చిరంజీవి గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు.
ఇక చిరంజీవి కూడా నాగార్జునను అంతే గౌరవిస్తారు. తాను ఎంతో అభిమానించి ఇష్టపడే నటుడు నాగార్జున అంటుంటారు. మరి ఇంత మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న వీరిద్దరిలో.. సినిమా రిలీజ్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవుతారన్నది హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవిని గౌరవించి కింగ్ సైడ్ అవుతారా లేక నాగ్ కోసం చిరును తప్పుకుంటారా అన్నది చూడాలి. సెప్టెంబర్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!