Allu Arjun:’పుష్ప ది రైజ్’ సక్సెస్ తో అల్లు వారసుడు అల్లు అర్జున్ మంచి జోష్ మీద వున్నాడు. ఈ క్రమంలో అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ కి బన్నీని చేరువ చేసిన చిత్రమిది. సౌత్ లో ఇతర భాషల్లోనూ బన్నీఅంతే ఫేమస్ కావడం విశేషం. ఊహని మించిన విజయాన్ని ‘పుష్ప’ తొలి భాగం అందుకోవడంతో బన్నీ అండ్ కో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. ఇదే జోష్ లో ఏప్రిల్ 8వ తేదీతో బన్నీ 40వ పడిలోకి అడుగుపెట్టారు. అదేనండి వయసు సంగతి.. దీంతో ఆయన పుట్టిన రోజు వేడుకల్ని సతీమణి స్నేహారెడ్డి ఎంతో ఘనంగా ఇటీవల నిర్వహించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Allu Arjun: ఇదే అసలు ట్విస్ట్:
సెర్బిబియా రాజధాని బెల్ గ్రాడ్ లో జరిగిన బర్త్ డే ట్రీట్ బన్నీ కెరీర్ లోనే మర్చిపోలేని బర్త్ డే మూవ్ మెంట్ గా చెప్పొచ్చు. పెళ్లికి ముందు స్నేహారెడ్డికి తాజ్ మహల్ ముందు ప్రపోజ్ చేసిన ఘటన ఎలా మరువలేరో.. అలా ఈ పుట్టిన రోజుని బన్నీ ఎప్పటికీ మర్చిపోలేడు. అయితే ఇక్కడ ఈ జంటతో పాటు కొంత మంది స్నేహితులు కూడా వెళ్లినట్టు, దాంట్లో మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ బయట పడింది.
ఇదీ అసలు సంగతి!
స్నేహారెడ్డి, అల్లు అర్జున్ స్నేహితులు మాత్రమే సెర్బియా వెళ్లినట్లు తెలుస్తోంది. స్నేహ ఏర్పాటు చేసిన ఈ పార్టీ కోసం ఏకంగా 40 మంది సెర్బియా వెళ్లారట. స్నేహ అందరికీ ప్లైట్ టిక్కెట్లు బుక్ చేసి స్పెషల్ కేర్ తో ఆహ్వానించి మరీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన ఒక్కరు కూడా లేకపోవడం కొసమెరుపు. కేవలం స్నేహారెడ్డి కి బాగా క్లోజ్ గా ఉండే కొంత మంది బయట స్నేహితుల్ని మాత్రమే పార్టీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా స్నేహ దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వీటిలో ఒక్క దాంట్లో కూడా మెగా ఫ్యామిలీ పర్సన్స్ లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.