నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలో నటించింది. టాలీవుడ్ లోనూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన జుగ్ జగ్ జియో, భూల్ భులయ్యా-2 సినిమాలు విజయాలు సాధించాయి. సోషల్ మీడియాలోనూ ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న ఫాలోయింగ్ వాడుకుంటూ తన అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. అందాల ఆరబోతతో ఫొటో షూట్ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లకొడుతోంది.
తాజాగా ఈ బ్యూటీ దారుణంగా ట్రోలింగ్ కి గురవుతోంది.. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్తూ ముంబైలో ఆమె కారులో నుంచి కిందకు దిగింది. ఆ సమయంలో జోరుగా వర్షం కురుస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో ఎవరైనా సొంతంగా గొడుకు పట్టుకుంటారు. కానీ, చాలా మంది సెలబ్రిటీలు తమ కోసం గొడుగులు పట్టుకోరు.. వారి వ్యక్తిగత బాడీగార్డ్స్ గొడుగు పట్టుకుంటారు. కియారా అద్వానీ కూడా అలాగే చేసింది. ఆమె కారు దిగగానే ఆమె సెక్యూరిటీ సిబ్బంది, బాడీ గార్డ్ గొడుగు పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కియారా అద్వానీ ఇలా చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా.. గొడుగు పట్టుకోవడానికి కూడా చేతకావడంలేదా?’, ఆమె తన గొడుగును కూడా పట్టుకోలేదా, ఆమెకు చేతులు లేవేమో, అందుకే గొడుగు కూడా పట్టుకోలేకపోతుంది అంటూ విమర్శిస్తున్నారు. నీకు గొడుకు పట్టుకోవడం మాత్రమే ముఖ్యమా? నీ సెక్యురిటీ గార్డులు ఏమైనా పర్వాలేదా? వారు తడుస్తూ.. నీకు గొడుగు పట్టుకోవాలా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి..