బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన పూనమ్ పాండే ఇటీవల పెళ్లి కూడా చేసుకుంది. అలాంటి హాట్ బ్యూటీ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటయ్యింది. పెళ్ళైన పది రోజులకే భర్త తనను వేదిస్తున్నట్టు పోలీసులను ఆశ్రయించింది ఈ హాట్ బ్యూటీ.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హాట్ బ్యూటీ పూనమ్ పాండే సెప్టెంబర్ 1 వ తేదీన సామ్ బాంబే అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్నీ ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. భర్తతో ఆమె తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లి జరిగినట్టు ప్రకటించిందింది. అయితే ఆమె గోవాలో హనీమూన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్టు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఇక గోవాలో ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే మరోవైపు ఆమె హనీమూన్ ని ఎంజాయ్ చేస్తుందని ఇన్నాళ్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయ్. కానీ అక్కడ జరిగింది అంత వేరు. తనకు భర్త సామ్ బాంబేకు మధ్య ఏం జరిగిందో తెలీదు.. ఉన్నట్టుండి సామ్ బాంబే భార్య పూనమ్ పాండేతో ఉన్న ఫోటోలు అన్నింటిని డిలేట్ చేశాడు.
ఇక ఇంతలోనే అతన్ని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. సామ్ బాంబే తనను వేధించాడు అని తనపై దాడి కూడా చేసినట్టు పూనమ్ పాండే సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. తన భర్త సామ్ బాంబే తనను బెదిరించడం మాత్రమే కాకుండా హింసించాడని పూనమ్ ఫిర్యాదు చేసిందని, అందుకే అరెస్ట్ చేసినట్టు వారు తెలిపారు. పూనమ్ పాండేని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పూనమ్ పాండేని సామ్ బాంబే ఎందుకు హింసించాడు? ఏ విషయంలో హింసించాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.