Acharya: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలను పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చిరంజీవి ఆచార్య అనే నక్సలైట్గా, రామ్ చరణ్ సిద్ధ అనే నక్సలైట్ నాయకుడిగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ విడుదల చేశారు. `సానా కష్టం వచ్చిందే మందాకినీ` అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్లో రెజీనా కసాండ్రాతో కలిసి చిరంజీవి అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రేవంత్, గీతామాధురి ఆలపించగా.. భాస్కరభట్ల లిరిక్స్ అందించారు.
అయితే ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఆ సాంగ్ కారణంగా ఆచార్య సినిమాపై ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ ఐటెం సాంగ్లో `ఎడాడో నిమరోచ్చని కుర్రాలంతా ఆర్ఏపీలు అయిపోతున్నారే` అనే లిరిక్ ఉంది. ఈ లిరిక్ తమను, తమ వృత్తిని కించపర్చేలా ఉన్నాయంటూ ఆచార్య చిత్రంపై తెలంగాణలోని జనగాంలో ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే గీత రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఆచార్య యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.