A.M. Ratnam: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మమతల ఒకానొక టైంలో ఏఎం రత్నం పేరు ఎక్కువగా వినబడేది. సూర్య మూవీస్ అధినేతగా తమిళంలో మరియు తెలుగులో అనేక భారీ ప్రాజెక్టులు ఒకానొక టైంలో ఏఎం రత్నం నిర్మించడం జరిగింది. కర్తవ్యం, పెద్దరికం, స్నేహం కోసం ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమా నిర్మించిన ఈ నిర్మాత అప్పట్లో తన కొడుకు రవి కృష్ణా ని ఇండస్ట్రీకి పరిచయం చేయటం తెలిసిందే. 7/g బృందావన కాలనీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రవికృష్ణ మొట్టమొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. 2004 వ సంవత్సరంలో రిలీజ్ అయిన 7/g టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో మంచి క్రేజ్ రావటంతో రవికృష్ణ తమిళంలో మరియు తెలుగులో భారీ సినిమాలు చేశాడు. కానీ పెద్దగా సక్సెస్ ఫుల్ హీరోగా రాణించలేకపోయాడు. అయితే దాదాపు పది సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరమైన రవికృష్ణ తాజాగా మరోసారి..రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళితే ప్రస్తుతం ఏఎం రత్నం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో తన కొడుకు రవి కృష్ణ చేత చిన్న పాత్ర చేయించి రీఎంట్రీ.. పవన్ సినిమా ద్వారా ఇచ్చే విధంగా ఏఎం రత్నం ప్లాన్ చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. రవికృష్ణ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది సంవత్సరాలు అయింది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఫస్ట్ సినిమా 7/g బృందావని కాలనీ లో..పవన్ కళ్యాణ్ అభిమాని గా రవికృష్ణ నటించడం జరిగింది. అయితే రీ ఎంట్రీ విషయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో చిన్న పాత్ర రవి కృష్ణ చేయటం వాస్తవమైతే.. మనోడు పంట పండినట్టే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.